AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anemia: రక్తహీనతను పరీక్షించడానికి కొత్త విధానం.. కంటి కింది రెప్ప ఫోటోతో..

Anemia: రక్తహీనతను పరీక్షించడానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గంతో ముందుకు వచ్చారు. స్మార్ట్‌ఫోన్ సహాయంతో, కంటి దిగువ భాగం యొక్క ఫోటో తీయడం ద్వారా రక్తహీనతను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు.

Anemia: రక్తహీనతను పరీక్షించడానికి కొత్త విధానం.. కంటి కింది రెప్ప ఫోటోతో..
Anemia Test
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 19, 2021 | 9:22 PM

Share

Anemia: రక్తహీనతను పరీక్షించడానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గంతో ముందుకు వచ్చారు. స్మార్ట్‌ఫోన్ సహాయంతో, కంటి దిగువ భాగం యొక్క ఫోటో తీయడం ద్వారా రక్తహీనతను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు. కనురెప్పల వెనుక కంటి దిగువ భాగం ఫోటోను విశ్లేషించే కృత్రిమ మేధస్సుతో కూడిన నమూనాను శాస్త్రవేత్తలు రూపొందించారు. పరీక్ష తర్వాత, ఆ వ్యక్తి రక్తహీనతతో బాధపడుతున్నాడా లేదా అనేది చెబుతుంది ఈ విధానం. ఈ పరిశోధన అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం, రోడ్ ఐలాండ్ హాస్పిటల్ పరిశోధకులు సంయుక్తంగా చేశారు.

పరిశోధకులు, ఫోటోను పరిశీలించే సాంకేతికత, దీనిని యాప్ గా సిద్ధం చేస్తారు. ఇలా చేసిన తరువాత, వ్యక్తి తన కళ్ళ ఫోటో తీయాలి. దీని తరువాత ఫోటోను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ యాప్ ఫోటోను పరిశీలించడం ద్వారా రక్తహీనతపై నివేదిక ఇస్తుంది. రక్తహీనత కు సంబంధించిన ఈ కొత్త పద్ధతి అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, రక్తహీనత కోసం రక్త పరీక్షలు చేయవలసిన అవసరం ఉండదు.

రక్తహీనత అంటే..

రక్తహీనత శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య (RBC ల) తక్కువగా ఉండడడం వల్ల వస్తుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపిస్తుంది. ఇది ఆక్సిజన్ ప్రసరణకు పనిచేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం పసుపు రంగులోకి రావడం ప్రారంభమవుతుంది. రక్తహీనత అతిపెద్ద లక్షణం ఇది. ప్రపంచ జనాభాలో 25 శాతానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు.

నొప్పిని భరించాల్సిన అవసరం లేదు

పరిశోధకుడు డాక్టర్ సెలిమ్ సునేర్, సాధారణ భాషలో, రక్తహీనత అంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గుతుందని అర్థం అని చెప్పారు. ప్రపంచంలో చాలా మంది దీనితో బాధపడుతున్నారు. రక్తహీనత మరణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్య రోగులలో.ఈ పద్ధతి కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే రోగులు రక్త నమూనాలను ఇవ్వడానికి నొప్పిని అనుభవించాల్సిన అవసరం లేదు. రక్తహీనతను గుర్తించడానికి చేతుల గోర్లు, అరచేతులకు వ్యతిరేకంగా కళ్ళను పరీక్షించడం ఖచ్చితమైన ఎంపిక అని గత పరిశోధనల్లో ఇప్పటికే రుజువు అయింది.

రక్తహీనత గుర్తించే అనుభవం గురించి తెలుసుకున్న తర్వాత శాస్త్రవేత్తలు స్మార్ట్‌ఫోన్ తో 142 మంది రోగుల కళ్ళ చిత్రాలు తీసుకున్నారు. కృత్రిమ మేధస్సు, అల్గోరిథంల సహాయంతో కంటి రంగును లోతుగా పరిశోధించారు. చిత్రం లోని ప్రతి పిక్సెల్ రంగు టోన్ తనిఖీ చేశారు. ఇది కాకుండా, 202 రక్తహీనత రోగులను కూడా ఈ నమూనాతో పరిశోధించారు. ఈ 72 శాతం మంది రోగులలో, రక్తహీనత కూడా కొత్త పరీక్ష ద్వారా నిర్దారించడం విశేషం.

Also Read: Skin Care : చర్మం మెరుస్తూ ఉండాలంటే ఈ 3 తప్పులు అస్సలు చేయొద్దు..! ఏంటో తెలుసుకోండి..

Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధులను నివారణకు ఈ 5 ఆహారాలు కచ్చితంగా మీ డైట్‌లో ఉండాల్సిందే..