Air Pollution: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాయుకాలుష్యంతో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ!

వాయుకాలుష్యం గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని ఇప్పటివరకు చేసిన అనేక పరిశోధనల్లో తేలింది. తాజాగా అమెరికాలో జరిగిన పరిశోధనలు ఇందుకు సంబంధించిన మరో సమాచారాన్ని అందజేస్తున్నాయి.

Air Pollution: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాయుకాలుష్యంతో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ!
Air Pollution
Follow us

|

Updated on: Nov 07, 2021 | 7:41 AM

Air Pollution: వాయుకాలుష్యం గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని ఇప్పటివరకు చేసిన అనేక పరిశోధనల్లో తేలింది. తాజాగా అమెరికాలో జరిగిన పరిశోధనలు ఇందుకు సంబంధించిన మరో సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఒక కిడ్నీ రోగి కనుక అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, వాయు కాలుష్యం అతని గుండెను మరింత బలహీనపరుస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవల అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ కిడ్నీ వీక్-2021లో పేర్కొన్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వాయు కాలుష్యం నేరుగా గుండె జబ్బులకు సంబంధించినది. వాయు కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకుంటే గుండె జబ్బుల ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు.

వాయు కాలుష్యం గుండె ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో పరిశోధకులు కనుగొన్నారు. -3 గ్లెసిటిన్ కిడ్నీ రోగులలో అధిక రక్తపు పీడన స్థాయిలతో పోరాడుతోంది. ఇది నేరుగా వాయు కాలుష్యానికి సంబంధించినది. దీని కారణంగా గుండె అంతర్గతంగా బలహీనంగా మారుతుంది. 1,019 మంది రోగులపై జరిపిన పరిశోధనలో అటువంటి రోగులలో మయోకార్డియల్ ఫైబ్రోసిస్ పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించింది. మీరు సులభమైన భాషలో అర్థం చేసుకుంటే, గుండె బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఇది గుండెపోటుకు లేదా మరణానికి కూడా దారి తీస్తుంది.

ఏటా 70 లక్షల మంది..

పారిశ్రామికరణ, టెక్నాలజీ వినియోగం, పెరుగుతోన్న ఇంధన వినియోగం ఇవన్నీ వాయు కాలుష్యాన్ని పెంచేస్తున్నాయి. ఈ గాలి కాలుష్యం కారణంగా ఏటా ఏకంగా 70 లక్షల మంది అకాల మరణం పొందుతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల్లో గాలి కాలుష్యం అతిపెద్దదని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. వాయు కాలుష్య నియంత్రణకు ప్రపంచ దేశాలు తక్షణమే చర్యలు ప్రారంభించాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే గాలి నాణ్యత మార్గదర్శకాలకు కఠినతరం చేసింది.

గాలి కాలుష్య ప్రభావం ఏ ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితం కాదని.. ఇది ప్రపంచ సమస్య అని తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని తెలిపింది. ఇక గాలి కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో ఎయిర్‌ క్వాలిటీ గైడ్‌లైన్స్‌ (AQG)ని రూపొందించింది. అయితే తాజాగా మరోసారి వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సదరు సూచనలను కఠినతరం చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఓజోన్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలను సవరించింది.

ఇవి కూడా చదవండి: GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!

Oppo: ఒప్పో నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. త్వరలో భారత మార్కెట్లో విడుదల..!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..