AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: తగ్గేదేలే.. మాస్క్ తీసేదేలే.. పుష్పరాజ్ వాడకం మాములుగా లేదుగా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా నటించిన చిత్రం 'పుష్ప'.  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మొదటిసారి 'ఊర మాస్ పాత్రలో అలరించాడు బన్నీ. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, సామ్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది.  గతేడాది

Pushpa: తగ్గేదేలే.. మాస్క్ తీసేదేలే.. పుష్పరాజ్ వాడకం మాములుగా లేదుగా..
Pushpa
Basha Shek
| Edited By: |

Updated on: Jan 19, 2022 | 9:14 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’.  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మొదటిసారి ‘ఊర మాస్ పాత్రలో అలరించాడు బన్నీ. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, సామ్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది.  గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులను అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.  క్రికెటర్లు, సినిమా తారలు వీటిని  రీక్రియేట్, స్పూఫ్స్, కవర్ సాంగ్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు  ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలని చెబుతూ పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న  బన్నీ ఫొటోకు  హెల్మెట్‌ పెట్టి    ‘హెల్మెట్‌ తప్పని  సరి.. తగ్గేదే లే..’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.  అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  ‘హెల్మెట్‌ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.’ అంటూ ట్వీట్‌ చేశారు

మై మాస్క్ ఉతారేగా  నహీ.. 

తాజాగా ఉత్తర ప్రదేశ్ పోలీస్ అధికారులు కూడా పుష్పరాజ్ ను వాడేసుకున్నారు.  కరోనా నిబంధనలపై  సామాన్యులకు అవగాహన కల్పించడంలో భాగంగా పుష్ప సినిమాలోని  బన్నీ ఫొటోకు మాస్క్ కప్పి మార్ఫింగ్ చేశారు.  ఆ ఫొటోపై ‘ మై మాస్క్ ఉతారేగా  నహీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ  ‘ కొవిడ్ పై పోరాటంలో మాస్కే మన ఆయుధం. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం మోసపోవద్దు’ అని రాసుకొచ్చారు. కాగా ట్రెండింగ్ లో ఉన్న సినిమా డైలాగులు, పాటలతో  వివిధ సామాజిక అంశాలపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం పరిపాటిగా మారింది. ప్రజలకు ఇవి బాగా చేరువవుతున్నాయి. ఈక్రమంలోనే యూపీ 112 అధికారులు పుష్పరాజ్ ను వాడుకున్నారు.   కాగా   ప్రముఖ  డెయిరీ వ్యాపార సంస్థ ‘అమూల్‌’ తన వ్యాపారం కోసం ‘పుష్పక్ ది స్లైస్‌.. అమూల్ హ్యావ్  స‌మ్ అమ్ములు, అర్జున్‌..’ అనే కార్టూన్‌ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

IND VS SA: దక్షిణాఫ్రికాకు షాకింగ్ న్యూస్.. వన్డే సిరీస్ నుంచి స్టార్ బౌలర్ ఔట్..!