AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: 64 ఏళ్ళ హీరోకు జోడీగా హాట్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిన నిధి అగార్వల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. కెరీర్ మొదటి నుంచి ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ రామ్ పోతినేని సరసన ఈ బ్యూటీ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే హిట్టయ్యింది. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు.

Nidhhi Agerwal: 64 ఏళ్ళ హీరోకు జోడీగా హాట్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిన నిధి అగార్వల్
Nidhhi Agerwal
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2025 | 10:23 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ పేరు తెచ్చుకుంది అందాల భామ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది. మొత్తంగా ఈ చిన్నది ఎనిమిది సినిమాలు చేసింది. వాటిలో ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది.

వాటిలో పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా ఒకటి. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత నిధి అగర్వాల్ క్రేజ్ మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నిధి అగర్వాల్ ఓ సీనియర్ హీరోతో రొమాన్స్ కు రెడీ అయ్యిందని తెలుస్తుంది. ఇంతకూ ఆ సీనియర్ హీరో ఎవరో తెలుసా.? రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్న వెంకటేష్.

ఇవి కూడా చదవండి

వెంకటేష్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను అనుకుంటున్నారట. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలాంటి కామెడీ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. అంతేకాదు ఈ సినిమాకు వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారని టాక్. నిధి అగర్వాల్ తో పాటు త్రిష కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.