చైనాలో ఎంబీబీఎస్.. అపోలోలో డాక్టర్.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్
చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ముందు ఇతర రంగాల్లో రాణించి ఆతర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. కొంతమంది మోడల్స్ గా, మరికొంతమంది డాక్టర్స్ గా పని చేశారు. ఇక ఈ హీరోయిన్ కూడా ఒకరు.. ఈ చిన్నది తెలుగులో క్రేజీ హీరోయిన్.. చైనాలో ఎంబీబీఎస్ చేసింది ఆతర్వాత డాక్టర్ అయ్యింది.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది కోట్లు కూడబెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం కనిపించకుండా పోతున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి సక్సెస్ అవుతున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారింది. అంతే కాదు తన అందచందాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..
పై ఫొటోలో ఉన్న హాట్ బ్యూటీ ఎవరో కాదు కామాక్షి భాస్కర్ల . ఈ బ్యూటీ చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్లో కొంతకాలం డాక్టర్గా చేసింది ఆమె, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. కామాక్షి తన నటనా జీవితాన్ని 2019లో “ప్రియురాలు” చిత్రంతో ప్రారంభించింది. అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు 2021లో విడుదలైన “మా ఊరి పొలిమేర” చిత్రంతో వచ్చింది. ఈ హారర్-థ్రిల్లర్ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత “పొలిమేర 2″లో లక్ష్మీ పాత్రలో నటించి మరింత ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..
అలాగే “విరూపాక్ష”, “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”, “ఓం భీమ్ బుష్” వంటి సినిమాలతో ఆకట్టుకుంటుంది. వీటితోపాటే, “ఝాన్సీ”, “సైతాన్”, “దూత” వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించింది. కామాక్షి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. హారర్, థ్రిల్లర్, కామెడీ శైలుల్లో తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా షో టైం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. 2018లో ఆమె “మిస్ తెలంగాణ” టైటిల్ గెలుచుకుని, “మిస్ ఇండియా” పోటీల్లో ఫైనల్స్ వరకు చేరుకుంది. ప్రస్తుతం కామాక్షి “పొలిమేర 3″తో సహా మూడు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఆమె గ్లామరస్ ఫోటోలు తరచూ దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ బ్యూటీని అభిమానులు “క్వీన్ ఆఫ్ హారర్ థ్రిల్లర్స్”గా పిలుస్తుంటారు.
ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా
Voir cette publication sur Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి