AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్‌ 8 వరకు సుశాంత్‌తో స‌హ‌జీవ‌నం చేశా : రియా

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ యువ హీరో ఆత్మ‌హ‌త్య‌కు అతడి ప్రియురాలు రియా చక్రవర్తి న‌డ‌వ‌డికే రీజ‌న్ అంటూ బిహార్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

జూన్‌ 8 వరకు సుశాంత్‌తో స‌హ‌జీవ‌నం చేశా : రియా
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2020 | 4:41 PM

Share

Sushant Singh Rajput Death Case : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ యువ హీరో ఆత్మ‌హ‌త్య‌కు అతడి ప్రియురాలు రియా చక్రవర్తి న‌డ‌వ‌డికే రీజ‌న్ అంటూ బిహార్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. రియా తన కుమారుడి నుంచి డబ్బులు గుంజుకోని, మోసం చేసి వెళ్లిపోయిందని సుశాంత్ ఫాద‌ర్ క్రిష్ణ కిషోర్‌ సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిహార్‌ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించగా.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ కేసు దర్యాప్తును బిహార్‌ నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఆమె పిటిషన్ లో కోరారు.

ఇందులో సుశాంత్‌తో తన రిలేష‌న్, అతడి మ‌ర‌ణం అనంత‌రం జరుగుతున్న పరిణామాల గురించి రియా పిటిషన్‌లో ప్రస్తావించిన విషయాలు సంచ‌ల‌నంగా మారాయి. గత ఏడాది కాలంగా తామిద్దరం డేటింగ్ చేస్తున్న‌ట్లు కోర్టుకు తెలిపిన ఆమె.. జూన్‌ 8న సుశాంత్‌ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌తో బాధ పడుతున్న సుశాంత్‌.. దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు మెడిసిన్ వాడేవాడని వివ‌రించారు. ఈ క్రమంలో జూన్‌ 14న బాంద్రాలోని తన ఇంట్లో అతడు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడ‌ని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆమె వాపోయారు. ప్రియుడి మరణంతో బాధ‌లో ఉన్న‌ తనను కొంత మంది రేప్ చేసి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలియ‌జేశారు.

ఇందుకు సంబంధించి ముంబైలోని శాంతాక్రజ్ పీఎస్ లో కూడా కంప్లైంట్ చేసిన‌ట్టు రియా చెప్పుకొచ్చారు. ఇప్పటికే సుశాంత్ సూసైడ్ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు తన స్టేట్మెంట్ రికార్డు చేశారని, అయినప్పటికీ మరోసారి పాట్నాలో కేసు నమోదు కావడం తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సుశాంత్‌ తండ్రి బిహార్‌లో తన పలుకుబడి ఉపయోగించి కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉన్నందున కేసును మంబైకి బదిలీ చేయాలని కోరారు. కాగా రియాతో బంధం కారణంగానే తన కొడుకు ఒత్తిడిలో కూరుకుపోయాడ‌ని సుశాంత్‌ తండ్రి ఆరోపించిన విషయం తెలిసిందే.

Read More : రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

Follow Us
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..