AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..

హైదరాబాద్‌ నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం రేగింది. పిల్లర్ నంబర్ 1482 దగ్గర ఉన్న వారాహి కన్సల్టెన్సీలోకి ఒక్కసారిగా చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మేనేజర్ శశికిరణ్ రెడ్డి, ట్రైనర్ లయపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శశికిరణ్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది.

Hyderabad: ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
Hyderabad Murder
Anand T
|

Updated on: Mar 10, 2026 | 6:50 PM

Share

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిల్లర్ నంబర్ 1482 దగ్గర ఉన్న ఓ కన్సల్టెన్సీలోకి దూరిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ కన్సల్టెన్సీ మేనేజర్‌పై కత్తులతో దాడి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మేనేజర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శశికిరణ్‌రెడ్డి అనే వ్యక్తి పిల్లర్ నంబర్ 1482 దగ్గర వారాహి కన్సల్టెన్సీని రన్ చేస్తున్నాడు. అయితే ప్రభు కుమార్ అనే వ్యక్తి ఇటీవల జాబ్‌ కోసం వారాహి కన్సల్టెన్సీని సంప్రదించారు. ఇందుకోసం రూ. 2000 డిపాజిట్‌ చేశాడు. కానీ ఎంతకీ జాబ్‌ రాకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రభు కుమార్ కంపెనీ నిర్వాహకులను నిలదీశాడు. అయితే సదరు సంస్ధ అతనికి 1500 ఆన్‌లైన్‌ చేశారు. మిగతా 500 తర్వాత ఇస్తామని చెప్పారు. కానీ నిందితుడు 500 కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇరువురి మధ్య గొడవ చెలరేగింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రభు కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మేనేజర్ శశికిరణ్‌రెడ్డి, ట్రైనర్ లయపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శశికిరణ్ రెడ్డి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించగా.. ట్రైనర్ లయ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే