అబ్బబ్బో.. బ్లాక్ శారీలో అందాల తుఫాన్.. పట్టించుకోని టాలీవుడ్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

02 April 2026

తెలుగు తెరపై అందం, అభినయంతో తనదైన ముద్ర వేసిన అందాల భామ నభా నటేష్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 

బ్లాక్ కలర్ శారీలో తన గ్లామరస్ ఫోజులతో మతిపోగొట్టేసే ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నారు.

చాలా కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అలాగే గ్లామర్ డోస్ పెంచేసి కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.

బ్లాక్ బ్యూటీ అంటే నీవే నభా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం నభా షేర్  చేసిన ఈ బ్లాక్ శారీ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ నభాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ ఒక్కసారిగా ఆమె కెరీర్ మార్చేసింది.

ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉండాల్సిన ఈ ముద్దుగుమ్మ..అనుహ్యంగా యాక్సిడెంట్ కారణంగా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంబు చిత్రంలో నటిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం.