టాలీవుడ్ లో నయా వార్.. 50 మిలియన్ మార్క్ ను అవలీలగా అందుకుంటున్న హీరోలు..

టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త వార్ నడుస్తోంది. గతంలో సినిమా రిలీజ్‌ తరువాత రికార్డ్స్‌ అన్న మాట వినిపించేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ నుంచే మొదలవుతోంది.

టాలీవుడ్ లో నయా వార్.. 50 మిలియన్ మార్క్ ను అవలీలగా అందుకుంటున్న హీరోలు..
Akhanda Movie
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: May 01, 2021 | 9:35 AM

టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త వార్ నడుస్తోంది. గతంలో సినిమా రిలీజ్‌ తరువాత రికార్డ్స్‌ అన్న మాట వినిపించేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ నుంచే మొదలవుతోంది. ముఖ్యంగా ఫస్ట్ టీజర్‌ క్రియేట్ చేసే రికార్డ్స్‌తోనే సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి పుష్పరాజ్‌ కూడా అడుగుపెట్టేశారు.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ పుష్ప. సుకుమార్‌ డైరెక్టర్‌ చేస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్‌ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ వదిలారు. బన్నీ మేకోవర్‌, క్యారెక్టరైజేషన్‌ను కూడా ఈ టీజర్‌లోనే రివీల్ చేశారు. పాన్ ఇండియా సినిమా కూడా కావటంతో పుష్పరాజ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అయ్యింది.

అంతేకాదు వేగంగా 50 మిలియన్ల మార్క్‌ రీచ్‌ అయిన సౌత్ టీజర్‌గానూ రికార్డ్ సృష్టించింది పుష్ప. ఈ మధ్యే ఈ క్లబ్‌లోకి ఎంటర్‌ అయ్యారు ఎన్టీఆర్‌. ట్రిపులార్‌ కొమురం భీమ్ టీజర్‌ కూడా 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించ్చనున్నాడు. ఇక  బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్నఅఖండ టీజర్‌ కూడా ఈ మార్క్‌ను రీచ్‌ అయ్యింది. ఇటీవలే విడుదలైన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Trivikram: ఈసారి గురూజీ గురి తప్పిందా?…మాటల మాంత్రికుడికి ఏమైందసలు? నెక్ట్స్ ఏంటి..?

Hero Prabhas Fans: ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ఆ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయట… ( వీడియో )