Allu Arjun: అల్లు అర్జున్కు గిఫ్ట్గా ‘పుష్పరాజ్’ లారీ.. ఎవరిచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
బన్నీతో పాటు ఆయన సతీమణి స్నేహలతా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అర్హకు సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. నెట్టింట్లో వీరి పోస్టులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు అతని తనయుడు అయాన్.
అల వైకుంఠ పురం సినిమాతో ఇండస్ట్రీ హిట్ను ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను సాధించింది.ఇప్పుడు పుష్ప: ది రూల్కు మరిన్ని హంగులో జోడించి తెరకెక్కించే పనిలో ఉన్నాడీ ఐకాన్ స్టార్. ఇటీవలే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కాగా బన్నీతో పాటు ఆయన సతీమణి స్నేహలతా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అర్హకు సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. నెట్టింట్లో వీరి పోస్టులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు అతని తనయుడు అయాన్. ఈ విషయాన్ని బన్నీనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ గిఫ్ట్ మరేంటో కాదు.. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్కు పుష్పరాజ్ ఓ లారీని వాడుతుంటాడు కదా. దీనికి ప్రతీకగానే బన్నీకి ఓ లారీ బొమ్మను బహుమతిగా ఇచ్చాడు అయాన్. అందంగా అలంకరించినట్లుగా ఉన్న ఆ బొమ్మపై పుష్ప అని రాసి ఉంది. పుష్ప థీమ్తో ఉన్న ఈ లారీ బొమ్మను కుమారుడి నుంచి గిఫ్ట్గా అందుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా మురిసిపోయాడు బన్నీ. నా ప్రియమైన అయాన్ చిన్నిబాబు నుంచి అందమైన కానుక అంటూ ఇన్స్టాగ్రామ్లో లారీ ఫొటోను షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై అభిమానులు క్యూట్ గిఫ్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో పుష్ప 2 అప్డేట్ ఇవ్వండి బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా పుష్ప సినిమా సీక్వెల్లోనూ రష్మికనే హీరోయిన్గా నటిస్తోంది. అనసూయ, సునీల్, ఫహద్ ఫాసిల్ కీ రోల్లో కనిపించనున్నారు. అయితే రెండో పార్టులో విజయ్సేతుపతితో పాటు మరికొందరు స్టార్ నటులు కనిపంచనున్నారని తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..