Nithiin: కళ్లు కనబడవు.. కానీ అతని వెనకాలే రక్తపు మరకలు.. ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్‏లుక్ పోస్టర్…

Nithiin BirthaDay: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Nithiin: కళ్లు కనబడవు.. కానీ అతని వెనకాలే రక్తపు మరకలు.. ఆసక్తికరంగా నితిన్ 'మాస్ట్రో' ఫస్ట్‏లుక్ పోస్టర్...
Nithiin
Follow us

|

Updated on: Mar 30, 2021 | 6:37 AM

Nithiin BirthaDay: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ సంవత్సరంలోని ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసారు నితిన్. అందులో చెక్ సినిమా ఆశించనంతగా హిట్ కాకపోగా.. ఇటీవలే విడుదలైన రంగ్ దే మూవీ పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా… ముచ్చటగా మూడో చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే మార్చి 30న నితిన్ పుట్టిన రోజు కావడంతో.. ఆయన కొత్త సినిమా టైటిల్‏తోపాటు ఫస్ట్ లుక్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి ‘మాస్ట్రో ‘ అనే పేరును ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించింది నితిన్ టీం. హిందీలో సూపర్ హిట్ సాధించిన అందాదున్ మూవీకి రీమేక్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ఫస్ట్‏లుక్ పోస్టర్‏లో చేతిలో స్టిక్ పట్టుకోని నడుస్తున్నాడు. అంటే ఈ మూవీలో అతను కళ్లు కనపడని వ్యక్తిలా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. నితిన్ వెనకాల ఉన్న పియానో పై రక్తపు మరకలు ఉన్నాయి. ఓ కళ్లు కనపడని వ్యక్తి వెనకాల రక్తపు మరకలు ఉండడంతో ఈ వ్యక్తి హత్య చేశాడనే అనుమానం కలిగించేలా పోస్టర్ విడుదల చేసింది యూనిట్. అయితే నితిన్ ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో ఎప్పుడూ నటించలేదు. దీంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. జె.యువరాజ్ కెమెరామెన్‏గా చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన నితిన్ రంగ్ దే మూవీ అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇందులో నితిన్‏కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్వీట్..

Also Read:

Rang De : పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న రంగ్ దే.. ఫస్ట్ వీక్ ఎంత వసూల్ చేసిందంటే..