AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్‌లో మరో రచ్చ.. నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న థియేటర్ల ఓనర్లు.. కారణం ఇదే..

టాలీవుడ్‌లో మరో రచ్చ మొదలైంది. నిన్నటి వరకు మా అసోసియేషన్ గొడవలు నానా హంగామా చేస్తే.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.

Tollywood: టాలీవుడ్‌లో మరో రచ్చ.. నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న థియేటర్ల ఓనర్లు.. కారణం ఇదే..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2021 | 8:12 PM

Share

Tollywood: టాలీవుడ్‌లో మరో రచ్చ మొదలైంది. నిన్నటి వరకు మా అసోసియేషన్ గొడవలు నానా హంగామా చేస్తే.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే కరోనా కల్లోలంతో దెబ్బతిన్న సినిమా పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతో సినిమాలన్నీ షూటింగ్‌లు మొదలుపెట్టాయి. చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కరోనా కారణంగా ఇన్ని రోజులు మూతపడిన థియేటర్స్ ఇటీవలే రీ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. మొన్నటివరకు థియేటర్స్ ఓపెన్ లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీలను ఆశ్రయించాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలో ఓటీటీ  రిలీజ్‌కు సిద్దమవ్వడం ఇప్పుడు వివాదానికి తెరలేపింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా వినాయక చవితి పురస్కరించుకొని సెప్టెంబర్ 10న థియేటర్స్‌‌లో విడుదల కానుంది. అయితే అదే రోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుంది. దీనిపై తెలంగాణ థియేటర్ల ఓనర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న థియేటర్లకు మద్దతు ఇవ్వాల్సిన నిర్మాతలు ఓటీటీని ఆశ్రయించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు వ్యతిరేకంగా ott కి మద్దతు ఇస్తున్న నిర్మాతల పై ఫైర్ అవుతున్నారు ఎక్సిబిటర్స్. దీనిపై రేపు (ఆగస్టు 20న) తెలంగాణ ధియేటర్ ఓనర్స్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: విలన్ పాత్రకోసం విలక్షణ నటుడు.. బాలయ్య కోసం బరిలోకి తమిళ్ హీరో

Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

Nayanthara : మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో నయనతార పాత్ర అదేనా..? క్లారిటీ వచ్చేసినట్టే.. ?