AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Budget: భారీ బడ్జెట్‌తో ప్రభాస్ ‘ఆదిపురుష్’.. ధృవీకరించిన నిర్మాత.. ఎంత ఖర్చు చేస్తున్నారంటే?

Adipurush Budget: భారతీయ సినిమాల్లో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటైన 'ఆదిపురుష'.. ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా అవతరించింది. ఆదిపురుష కంటే ముందు ప్రభాస్ 'బాహుబలి-2' రూ.250 కోట్లతో, 'బాహుబలి-1' రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందాయి.

Adipurush Budget: భారీ బడ్జెట్‌తో ప్రభాస్ 'ఆదిపురుష్'.. ధృవీకరించిన నిర్మాత.. ఎంత ఖర్చు చేస్తున్నారంటే?
Adipurush Budget
Venkata Chari
|

Updated on: Jun 02, 2022 | 6:15 AM

Share

Adipurush Budget: సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ గురించి చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరో ఆసక్తికర న్యూస్‌తో ప్రభాస్ నెట్టింట్లో సందడి చేస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుత సినిమా ఆదిపురుష బడ్జెట్ గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా అంతకు ముందు ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ కంటే ఎక్కువ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమాల్లో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’.. ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా అవతరించింది. ఆదిపురుష కంటే ముందు ప్రభాస్ ‘బాహుబలి-2’ రూ.250 కోట్లతో, ‘బాహుబలి-1’ రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత భూషణ్ కుమార్ కూడా ఈ సినిమా బడ్జెట్‌పై కన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ‘ఆదిపురుష’ కూడా భారతీయ సినిమా అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

భూషణ్ కుమార్ మాట్లాడుతూ “ఆదిపురుష్ చిత్రం రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించి ప్రపంచవ్యాప్తంగా హౌస్‌ఫుల్‌గా వెళ్తుందని ఆశిస్తున్నాం. అందుకే ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టేందుకు ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టకూడదనుకుంటున్నాం. బడ్జెట్ ఖరారైన తర్వాత చూసేందుకు జనాలు వస్తారని మాకు తెలుసు. ఎందుకంటే ఇది అలాంటి సినిమా అవుతుంది. అందుకే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.

దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ, “నా శక్తి మేరకు రాముడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నా జీవితాంతం అర్థం చేసుకుంటూనే ఉంటాను. నా జ్ఞానానికి కళ్ళు, హృదయానికి ప్రతిబింబం. ప్రభాస్ ఎంతో స్వచ్ఛమైన ఆత్మ. చాలా ప్రశాంతంగా ఉంది. కళ్ల ద్వారా నేను శ్రీరాముడి ఊహకు దగ్గరగా వచ్చాను. నేను అతనిని చూసిన ప్రతిసారీ, అతని ఆత్మ కళ్లలో కనిపిస్తుంది. అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది” అని పేర్కొన్నాడు

ఇవి కూడా చదవండి

జనవరి 12, 2023న థియేటర్లలో..

ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని 12 జనవరి 2023న ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్క్రీన్‌లలో విడుదల చేయనున్నారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా ఇదే అవుతుంది.