Shivani Rajasekhar : మరోసారి ఓటీటీలోనే రానున్న శివాని రాజశేఖర్ సెకండ్ సినిమా..
ఇటీవలే అద్భుతం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రాజశేఖర్ తనయ శివాని రాజశేఖర్. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ చిన్నది.
Shivani Rajasekhar : ఇటీవలే అద్భుతం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రాజశేఖర్ తనయ శివాని రాజశేఖర్. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ చిన్నది. ఇక ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి సినిమానే అయినా శివాని అద్భుతంగా నటించి శబాష్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా కథల విషయం ఆచి తూచి అడుగులేస్తున్న శివాని ఇప్పుడు ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఓ మిస్టరీ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదలకానుంది. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` డిజిటల్ రైట్స్ని `సోనిలివ్` సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం సోనిలివ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఈ సినిమా శివునికి మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :