Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘ఏడుస్తున్నా..తప్పదుగా’.. నెట్టింట వైరలవుతున్న సమంత ఆసక్తికర పోస్ట్..

కొద్దిరోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నారు సమంత. ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ షూటింగ్స్‏కు బ్రేక్ ఇచ్చారు. అటు నెట్టింట కూడా సైలెంట్ అయింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్... శనివారం ముంబై ఎయిర్ పోర్టులో మెరిసింది.

Samantha: 'ఏడుస్తున్నా..తప్పదుగా'.. నెట్టింట వైరలవుతున్న సమంత ఆసక్తికర పోస్ట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2023 | 12:23 PM

చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు టాలీవుడ్ బ్యూటీ సమంత. ఇటీవల యశోద సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొద్దిరోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ షూటింగ్స్‏కు బ్రేక్ ఇచ్చారు. అటు నెట్టింట కూడా సైలెంట్ అయింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్… శనివారం ముంబై ఎయిర్ పోర్టులో మెరిసింది. ఇక ప్రస్తుతం ఆమె శాకుంతలం సినిమా డబ్బింగ్ పనులలో పాల్గొంటుంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా సామ్ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతుంది. జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నా.. శాకుంతలం సినిమాలోని భంగిమను అనుసరిస్తూ ఫోటోకు ఫోజులిచ్చింది. శాకుంతలం సినిమా భంగిమను ఎలా ఉన్నా కొనసాగించాలంటూ చెప్పుకొచ్చింది.

“శాకుంతలం చిత్రం కష్టమైన అంశం ఏమిటంటే.. నడుస్తున్నప్పుడు.. మాట్లాడుతున్నప్పుడు.. నడుస్తున్నప్పుడు.. ఏడుస్తున్నప్పుడు కూడా దయ.. భంగిమను కొనసాగించడం. దయ అనేది నా విషయం కాదు. అందుకు సాషాను కూడా వెంట తీసుకెళ్లి ఉండాల్సింది. “అంటూ శకుంతల భంగిమను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. సాషాకు సంబంధించిన విషయాలు మాత్రమే సమంతను నవ్వించగలవు.. మీకు మీరుగా పోరాడటం గొప్ప విషయం మేడమ్.. మయోసైటిస్ నుంచి మీరు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ప్రస్తుతం సామ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఖుషి చిత్రంలోనూ నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.