Sai Dharam Tej: నన్ను కాపాడిన అబ్దుల్‌ను కలిశా.. ఏ అవసరమైనా అతనికి అండగా ఉంటా: సాయి ధరమ్ తేజ్‌

మెగా మేనల్లుడు, టాలీవుడ్‌ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియాకు వెళ్లే మార్గంలో తేజ్ బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తేజ్‌ ఛాతీతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి.

Sai Dharam Tej: నన్ను కాపాడిన అబ్దుల్‌ను కలిశా.. ఏ అవసరమైనా అతనికి అండగా ఉంటా: సాయి ధరమ్ తేజ్‌
Sai Dharam Tej
Follow us

|

Updated on: Jul 27, 2023 | 1:04 PM

మెగా మేనల్లుడు, టాలీవుడ్‌ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియాకు వెళ్లే మార్గంలో తేజ్ బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తేజ్‌ ఛాతీతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే అదే మార్గంలో వస్తున్న మెగా మేనల్లుడిని షాహిద్‌ ఫర్హాన్‌ అనే యువకుడు కాపాడాడు. రోడ్డు పక్కన తేజ్‌ను కూర్చొబెట్టి వెంటనే అంబులెన్స్‌కు కాల్‌ చేసి ఆస్పత్రికి తరలించాడు. ఫర్హాన్‌ అబ్దుల్‌ సత్వరమే స్పందించడంతో తేజ్‌కు ప్రాణాపాయం తప్పింది. అయితే సకాలంలో స్పందించి సాయం చేసిన అబ్దుల్‌కు ఎలాంటి సాయం అందలేదని ఆ మధ్యన వార్తలు పుట్టుకొచ్చాయి. ఫర్హాన్‌ సైతం ఈ విషయంపై మాట్లాడుతూ.. తేజ్‌ నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదన్నాడు. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించాడు సుప్రీం హీరో. తన లేటెస్ట్‌ సినిమా బ్రో ప్రమోషన్లలో పాల్గొన్న తేజ్‌ ఇటీవలే అబ్దుల్‌ను కలిశానని చెప్పుకొచ్చాడు. అలాగే అతనికి ఎప్పుడు, ఏ అవసరమొచ్చినా అండగా ఉంటానన్నాడు.

‘ఈ విషయంపై కొందరు సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నాను. నాకు సాయం చేసిన అబ్దుల్‌కి కొన్ని డబ్బులిచ్చి చేతులు దులుపుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను నా ప్రాణాలను కాపాడాడు. నేను అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని చెప్పాను. ఈమధ్య కూడా అబ్దుల్‌ను కలిశాను. నాతో పాటు నా టీం అతనికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది’ అని తెలిపాడు సాయి ధరమ్‌ తేజ్‌. మరోవైపు తన మామ పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించడం గర్వంగా ఉందన్నాడు తేజ్‌. కాగా బ్రో సినిమా శుక్రవారం (జులై 28)న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..