Ram Gopal Varma: అత్యాచార ఘటనలపై ఆర్జీవీ సెన్సెషనల్ కామెంట్స్.. వాళ్లు రాక్షసులుగా ఎందుకు మారారో తెలుసుకోరా అంటూ..
రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనల ఆధారంగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే సంఘంలో

రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనల ఆధారంగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే సంఘంలో పలువురు ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలా వాస్తవిక సంఘటన దిశ ఘటన ఆధారంగా కల్పిత కథతో వస్తున్న ఈ సినిమా ఆశ: ఎన్ కౌంటర్. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా. అనురాగ్ కంచర్ల నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా షూటింగ్తోపాటు అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు ఆర్జీవి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ఈ సినిమా దిశ సంఘటన మాత్రమే కాదని.. దేశంలో జరిగిన అన్ని ఘటనల ఆధారంగా కలబోత అని అన్నారు. “ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం కావొచ్చు. హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన కావొచ్చు. దేశంలో ఎప్పుడూ ప్రతిచోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఆ ఘటనలన్నింటినీ సినిమాల చూపించాం. ప్రత్యేకంగా ఓ అమ్మాయి మీద జరిగిన ఘటన మాత్రమే కాదు. ఇప్పటివరకు జరిగిన ఘటనలలో ఓ కామన్ పాయింట్ ఉంటుందని.. ఒంటరిగా అమ్మాయి కనిపించగానే గ్యాంగ్లు ప్లాన్ చేసి ఆత్యాచారలకు పాల్పడుతుంటాయి.. ఎన్ని చట్టాలు తెచ్చిన దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఘటనకు ముందు నిందితులంతా అందరిలాగే మామూలు మనుషులు… వారి మీద ఎలాంటి నేర చరిత్ర కూడా ఉండదు.. కానీ ఘటన జరిగిన రోజు క్షణాల్లో వాళ్లంతా రాక్షసుల్లాగా మారిపోతున్నారు. అసలు వాళ్లకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ?. అప్పటిదాకా బాగున్నవారు అలా రాక్షసులుగా ఎలా మారారు ? అనేది తెలుసుకోకుండా.. వారిని కాల్చి చంపేస్తే అది పోలీస్ స్టేట్ అయిపోదా?” అంటూ ప్రశ్నించారు ఆర్జీవి.
ఈ సినిమా స్టోరీ గురించి చాలా మంది పోలీసులతో మాట్లాడానని.. వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నాకే సినిమా తీశామన్నారు ఆర్జీవీ. సినిమా కథలకు కొన్ని పరిధులు పెట్టుకున్న తర్వాత డైరెక్టర్ ఆ పరిధి దాటి వెళ్లలేడని.. అలాంటప్పుడు ఆ కథను తాను తీసినా, వేరే డైరెక్టర్ తీసినా పెద్దగా మార్పు ఉండదన్నారు. సినిమాలో ఆత్యాచారం ఎపిసోడ్ 45 నిమిషాలు ఉంటుందని.. ఆ తర్వాత ఆమెను చంపి, శవాన్ని మాయం చేయడం.. నిందితులను ఎన్ కౌంటర్ చేయడం వంటి సన్నివేశాలుంటాయన్నారు. ఆశ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద్ చంద్ర మంచి ప్రతిభ ఉన్నవాడని.. అందుకే సినిమా బాధ్యతలు అప్పగించాను అని అన్నారు.
Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్ మసాలా సాంగ్స్.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..




