Rajinikanth: కూలీ సినిమాకోసం రజనీకాంత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా? ఆసియాలోనే అత్యధికంగా..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న సినిమా 'కూలి' బడ్జెట్ రూ.400 కోట్లు దాటింది. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు నటించారు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం రజనీకాంత్ భారీ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘విక్రమ్’, ‘ఖైదీ’, మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు లోకేష్. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అతను ఇప్పుడు సూపర్ స్టార్ తో కూలీ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఓ క్యామియో రోల్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కూలీ సినిమా ఆర్టిస్టుల పారితోషికం వెల్లడైంది. ఈ సినిమాకు రజనీకాంత్ 260 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘కేజీఎఫ్’ సినిమా బడ్జెట్ 80 కోట్లు. అంటే రజనీ రెమ్యునరేషన్ తో ఏకంగా మూడు కేజీఎఫ్ సినిమాలు చేయచ్చన్న మాట. ఇక ఇదే సినిమా కోసం డైరెక్టర్ లోకేష్ దాదాపు 60 కోట్ల రూపాయల పారితోషికం అందుకోనున్నారని టాక్.
రజనీకాంత్ వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషకం తీసుకుంటోన్న నటుల్లో ఆయన కూడా ఒకరు. ఈ క్రమంలోనే కూలీ సినిమా కోసం రజనీ 260 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని టాక్. గతంలో దళపతి విజయ్ ఒక సినిమాకు 275 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Superstar #Rajinikanth‘s powerful still from #Coolie Movie💥 In Cinemas From AUGUST 14th🎬#SuperstarRajinikanth #ShrutiHaasan #SathyaRaj #Anirudh #LokeshKanagaraj #SriBalajiVideo pic.twitter.com/zaejZYDDUh
— Sri Balaji Video (@sribalajivideos) May 8, 2025
కూలీ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడు. ఇందుకు గానూ ఆయన 24 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని టాక్. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, కన్నడ ఉపేంద్ర, సత్యరాజ్ కూడా ఉన్నారు. అయితే వారి పారితోషికం ఎంత అనేది ఇంకా వెల్లడించలేదు. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడ. ఆయన కూడా 30 కోట్ల రూపాయలు అందుకున్నాట. ఇక స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే 2 కోట్ల రూపాయలు అందుకుందని సమాచారం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .