AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Neel: డంకి సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్.. ఏమన్నారంటే

రెండు పెద్ద సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.. ఏ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందన్నది చూడాలి. ఇప్పటికే ప్రేక్షకులు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎంత విజయం సాధిస్తుంది అన్న దానిపై ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దీనిపై చిత్ర దర్శకుడు, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ స్పందించారు. 

Prashanth Neel: డంకి సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్.. ఏమన్నారంటే
Dunki
Rajeev Rayala
|

Updated on: Nov 30, 2023 | 6:22 PM

Share

ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో షారూఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ కూడా విడుదలవుతోంది. రెండు పెద్ద సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.. ఏ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందన్నది చూడాలి. ఇప్పటికే ప్రేక్షకులు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎంత విజయం సాధిస్తుంది అన్న దానిపై ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దీనిపై చిత్ర దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ స్పందించారు.

ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ‘డంకీ’-‘సలార్’ మధ్య పోటీ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.., “కొత్త నటుడైనా లేదా ఇండియన్ సూపర్‌స్టార్ అయినా, ఇలాంటి బాక్సాఫీస్ పోటీని ఎవరూ కోరుకోరు. ఏది ఏమైనా నాకు ఇష్టమైన దర్శకుల్లో రాజ్‌కుమార్ హిరానీ ఒకరు. ‘డంకీ’ సినిమా చూస్తాను. చాలా మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది.

అలాగే ‘సలార్’ సినిమా కథ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘సలార్’ సినిమాలో స్నేహం కథాంశంతో ఉంటుందని అన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారనేదే సినిమా కథ. సినిమా మొదటి భాగంలో సగం కథ చెబుతాం, మిగిలిన కథ రెండో భాగంలో ఉంటుంది. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు స్నేహితుల ప్రయాణాన్ని ప్రేక్షకులు మా సినిమాలో చూస్తారు. ‘సలార్’ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ప్రేక్షకులకు మనం సృష్టించిన ప్రపంచం పరిచయం అవుతుంది’’ అని నీల్ అన్నారు.

ఈ ఏడాది భారీ అంచనాలున్న సినిమాల్లో సలార్ ఒకటి. విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడి ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ సినిమా కన్నడలో వచ్చిన ‘ఉగ్రమ్’కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం-శత్రుత్వమే సినిమా కథ. ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయిక. కన్నడిగర మధు గురుస్వామి, గరుడ ఫేమ్ రామచంద్ర, ‘రత్నన్ మంచా’ నటుడు పంజు, బజరంగీ లోకి కూడా నటించారు. ఆయనతో పాటు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు టిను ఆనంద్, జాకీ మిశ్రా ఇంకా చాలా మంది నటీనటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. రవి బస్రూరు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.