ప్రధాని గుర్తించలేదా..? పర్లేదు..ప్రపంచమే గుర్తించింది..!

బాహుబలి..తెలుగు సినిమా పవర్‌ని ప్రపంచానికి చాటిన సినిమా. జక్కన్న చెక్కిన విజువల్ వండర్‌కి ప్రపంచం మొత్తం సాహో అంది. ప్రపంచలోని అనేక దేశాలలో కూడా ‘బాహుబలి’ సింహనాదం చేసింది. ఇండియన్ సినిమాకి ఎన్నో గౌరవవాలు ఈ చిత్రం అందించింది. బాహుబలి ద్వారా తెలుగు సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన ఘనత ఈ దర్శక ధీరుడిదే. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్ ని […]

ప్రధాని గుర్తించలేదా..? పర్లేదు..ప్రపంచమే గుర్తించింది..!
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 11:50 AM

బాహుబలి..తెలుగు సినిమా పవర్‌ని ప్రపంచానికి చాటిన సినిమా. జక్కన్న చెక్కిన విజువల్ వండర్‌కి ప్రపంచం మొత్తం సాహో అంది. ప్రపంచలోని అనేక దేశాలలో కూడా ‘బాహుబలి’ సింహనాదం చేసింది. ఇండియన్ సినిమాకి ఎన్నో గౌరవవాలు ఈ చిత్రం అందించింది. బాహుబలి ద్వారా తెలుగు సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన ఘనత ఈ దర్శక ధీరుడిదే. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్ ని తో వచ్చిన ఈ దృశ్యకావ్యానికి ఎన్నో పురస్కారాలు వచ్చాయి.

తాజాగా లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ కు 148 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉండగా.. ఇన్నేళ్ల చరిత్రలో అక్కడ ప్రదర్శితమైన తొలి ఇంగ్లీషేతర చిత్రంగా  కూడా మన ‘బాహుబలి’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అంతే కాదు ఈ హాల్‌లో రాజమౌళి సాంప్రదాయ పంచె కట్టులో మెరిశాడు. భుజం మీద కండువాతో కనిపించి కనువిందు చేశాడు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఆ ప్రపంచ వేదికపై తెలుగు సాంప్రదాయాన్ని కూడా పరిచయం చేశాడు. హాలీవుడ్ సినిమాలకు కూడాా లేని స్థాయిలో  రాయల్ ఆల్బర్ట్ హాల్ లో నెలకొన్న సందడి చూసి నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదీ సౌత్ సినిమా స్థాయి.

ఇలా పక్కదేశాలలో కూడా మన సినిమాని మెచ్చుకుంటుంటే స్వదేశంలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశ ప్రధాని కూడా మన సౌత్ సినిమా ప్రముఖులను గుర్తించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా స్వచ్ఛ భారత్ ఇతర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఆయన సినీ పరిశ్రమతో చర్చించేందుకు వారిని ఆహ్వానించారు. అయితే అక్కడ అన్నీ బాలీవుడ్ ముఖాలే కనిపించాయి. సౌత్ నుంచి ఇన్విటేషన్ అందుకున్నవారు కూడా పెద్దగా ఎవరూ లేరని సమాచారం. మన ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు వెళ్లినా..ఒకవైపు బాలీవుడ్ జనాలు ప్రధానితో ఫోటోలు దిగుతంటే..ఈయన మాత్రం దూరంగా నిలుచుండిపోయారు.

అసలు దక్షిణాదిపై ఇంత చిన్నచూపు ఎందుకనేది చాలామంది వాదన. ఇప్పటికే ఈ భేదం చూపిస్తున్నారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో..ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి వాటిని రూపుమాపే విధంగా అడుగులు వేయాలి. కానీ ప్రస్థుత పరిస్థితులు తారతమ్యాలు ఉన్నాయన్న ధోరణికి మరింత ఆజ్యం పోశాయి. వాస్తవానికి సౌత్ సినిమాలు, దర్శకులు ఇప్పుడు చూపిస్తున్న ఇంపాక్ట్ అసమాన్యమైనది. ఎంతలా అంటే బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఇక్కడి సినిమాలను రీమేక్ చేస్తూ.. మన దర్శకులతో సినిమాలు డైరెక్ట్ చేయిస్తూ హిట్స్ వెనకేసుకుంటున్నారు. అలాగని వారిని తక్కువ చేస్తున్నామని కాదు..టాలెంట్, క్రియేటివిటీ ఎక్కడున్నా గుర్తించాల్సిన అవసరం ఉంది.  ఇంకెన్ని “బాహుబలి’ లాంటి సినిమాలు వస్తే సౌత్ సినిమా సత్తా తెలుస్తుందో ?. డియర్ మేకర్స్ మీరే చూపించాలి..మన స్థాయి..స్థానం.