Radhe Shyam: అభిమానులకు షాకిచ్చిన రాధేశ్యామ్ టీం.. నగుమోము తారలే సాంగ్ వాయిదా.. ఎందుకంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న

Radhe Shyam: అభిమానులకు షాకిచ్చిన రాధేశ్యామ్ టీం.. నగుమోము తారలే సాంగ్ వాయిదా.. ఎందుకంటే..
Radhe Shyam
Follow us

|

Updated on: Dec 01, 2021 | 5:04 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రం నుంచి సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో ప్రభాస్.. భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడతూ వచ్చింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ సంగతి తెలిసిందే. దీంతో రాధేశ్యామ్ చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు వరుస అప్డేట్స్ అభిమానులను ఖుషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి నగుమోము తారాలే అనే సాంగ్ టీజర్ విడుదల చేసింది. ఇక ఈ ఫుల్ సాంగ్‏ను ఈరోజు విడుదల చేయాల్సి ఉంది. కానీ.. టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి మృతి చెందిన కారణంగా నగుమోము పాటను రేపు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. సిరివెన్నెల మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాష్లో సెకండ్ సింగిల్ పాటను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Ajith Kumar: అభిమానులకు హీరో అజిత్ విజ్ఞప్తి.. ఇకపై తనను అలా అని పిలవద్దంటూ..

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..

Kiran Abbavaram: తీవ్ర విషాదంలో కిరణ్ అబ్బవరం.. రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు దుర్మరణం