AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: “మా”లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్.. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు లేఖ

"మా " లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్‌గా అయ్యారు. ఎన్నికల పేరుతో ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవటంపై...

Chiranjeevi: మాలో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్.. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు లేఖ
Chiranjeevi
Ram Naramaneni
| Edited By: Rajitha Chanti|

Updated on: Aug 09, 2021 | 9:41 PM

Share

“మా ” లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్‌ అయ్యారు. ఎన్నికల పేరుతో ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవటంపై ఆయన ఫైర్ అయ్యారు. దీనికి కారకులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ “మా ” క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు చిరంజీవి లెటర్ రాసారు. “మా ” ఎన్నికల వివాదం ప్రారంభమైన నాటి నుంచి చిరంజీవి స్తబ్ధుగా ఉన్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌కు మద్దతు పలికారు. దీంతో మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఆయనకే అని అర్థం అయ్యింది. కానీ, ఎన్నికలు ఎప్పుడు జరిగే విషయంపై క్లారిటీ రాలేదు. ఈలోగా పోటీలో ఉన్న వారు.. వారికి మద్దతిస్తున్న వారు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

తాజాగా హేమ వాయిస్ మెసేజ్.. దానికి “మా ” ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, జీవితల కౌంటర్లతో విమర్శల పర్వం మరింత జోరందుకుంది. ఈ క్రమంలో  క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు చిరు లేఖ రాశారు. “మా ” ఎన్నికలు వెంటనే జరపాలంటూ చిరంజీవి అందులో కోరారు. “మా ” ప్రతిష్ట దెబ్బ తీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దంటూ క్రిష్ణంరాజుకు సూచించారు. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. అదే విధంగా.. సభ్యుల బహిరంగ ప్రకటనలతో మా ప్రతిష్ఠ మసక బారుతోందని లేఖలో ప్రస్తావించారు. “మా ” ఎన్నికల వ్యవహారంలో చిరంజీవి లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కాగా ఈసారి “మా ” ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం అయిదుగురు పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, నరసింహారావు ఈ పోటీలో ఉన్నారు.

చిరంజీవి రాసిన లెటర్ దిగువ ట్వీట్‌లో చూడండి:

Also Read:జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పెళ్లిళ్లు, సభలు, సమావేశాలకు లిమిట్… అతిక్రమిస్తే

ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ