Kangana Ranaut : మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్.. కంగనా తలైవికి సీక్వెల్ రానుందా.. ?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా తలైవి. సినీనటి, రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

Kangana Ranaut : మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్.. కంగనా తలైవికి సీక్వెల్ రానుందా.. ?
Kangana
Follow us

|

Updated on: Sep 24, 2021 | 11:23 AM

Thalaivii: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా తలైవి. సినీనటి, రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో నడిచింది. ఇక ఈ సినిమాలో అలనాటి నటుడు, రాజకీయ నాయకుడు అయిన ఎంజీఆర్ క్యారెక్టర్‌లో విలక్షణ నటుడు అరవిద స్వామి నటించారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా.. విబ్రి మీడియా- కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిచాయి. తమిళంలో ఓ మాదిరిగా ఆడిన ‘తలైవి’.. తెలుగు హిందీ భాషల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్కు మంచి ఆఫర్లు వచ్చినా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

జయలలిత నట జీవితంతో పాటు రాజకీయ ప్రయాణంలో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే వరకే ఈ సినిమాలో చూపించారు. ఇక ఇప్పుడు ఆమె జీవితంలో మిగిలిన ఘట్టాన్ని చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాలను ప్రస్తావిస్తూ.. సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ తో సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ సీక్వెల్‌కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy: ఈ సారి నెట్‌ఫ్లిక్స్‌కు ఓటేసిన నాని.. భారీ ధరకు శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Bigg Boss 5 Telugu: పదవతరగతిలోనే అతడితో ఇల్లువదిలి పారిపోయా.. ఎమోషనల్ అయిన సిరి..