Mahesh Babu : ఈ విషయం రివీల్ చేయడం సంతోషంగా ఉంది.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ సైతం సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ వారణాసి. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ విషయమేంటంటే.. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా జయకృష్ణ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మహేష్ బాబు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
గ్రామీణ నేపథ్యంలో రాబోతున్నా ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్పై పి కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జయకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు మహేష్. ఈ పోస్టర్లో జయ కృష్ణ బైక్ నడుపుతూ శత్రువులపై తుపాకీ గురిపెట్టి యాక్షన్ సీక్వెన్స్లో ఉన్నట్లు కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
“#శ్రీనివాస మంగళపురం ఫస్ట్ లుక్ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. #జయకృష్ణఘట్టమనేని అరంగేట్రం సందర్భంగా నీకు శుభాకాంక్షలు. బలమైన బృందం, ఆసక్తికరమైన ప్రారంభం… అందుకే మొత్తం బృందానికి శుభాకాంక్షలు.” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా..ఈ చిత్రం 2026లో విడుదల అవుతుంది.
Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq
— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
