‘క్షీరసాగర మథనం’ టీజర్ విడుదల
క్షీర సాగర మథనం సినిమా టీజర్ విడుదల చేశారు డైరెక్టర్ క్రిష్ జాగర్లపూడి. మానవ సంబంధాలకు అద్దం పట్టే విధంగా ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలతో రూపొందిన సినిమా క్షీర సాగర మథనం.
క్షీర సాగర మథనం సినిమా టీజర్ విడుదల చేశారు డైరెక్టర్ క్రిష్ జాగర్లపూడి. మానవ సంబంధాలకు అద్దం పట్టే విధంగా ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలతో రూపొందిన సినిమా క్షీర సాగర మథనం. ఈ చిత్రాన్ని అనిల్ పంగులూరి తెరకెక్కించగా.. శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ని కొద్ది సేపటి క్రితమే క్రిష్ విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. చిత్ర షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తారా? లేక ఓటీటీలో విడుదల చేస్తారా. అన్నది తెలియాల్సి ఉంది.