అప్పుడే మొదలెట్టేశాడు…’లైట్స్, కెమెరా, మాస్క్ ఆన్, యాక్షన్’
అసలే కరోనా.. అని భయపడుతున్న ఈ సమయంలో షూటింగ్ అంటేనే వణికిపోతోంది సినిమా ప్రపంచం. ఇలాంటి సమయంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ 'లైట్స్, కెమెరా, మాస్క్ ఆన్, యాక్షన్' అంటూ క్లాప్ కొట్టేశాడు...
అసలే కరోనా.. అని భయపడుతున్న ఈ సమయంలో షూటింగ్ అంటేనే వణికిపోతోంది సినిమా ప్రపంచం. ఇలాంటి సమయంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ‘లైట్స్, కెమెరా, మాస్క్ ఆన్, యాక్షన్’ అంటూ క్లాప్ కొట్టేశాడు. ఈ షూటింగ్ ఇక్కడ కాదు.. స్కాట్ ల్యాండ్లో మొదలు పెట్టేశాడు. ఒకరు ఇద్దరితో కాదు ఏకంగా ఇండియా నుంచి 120 మంది చిత్రం సభ్యులతో అక్కడే మకాం వేశాడు. అంతే కాదు ఇప్పుడు మాస్క్తో సినిమా కూడా మొదుల పెటేశాడు.
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా ‘బెల్ బాటమ్’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రంజిత్.ఎమ్.తివారీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్ తన ట్విటర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో అక్షయ్ ‘‘లైట్స్, కెమెరా, మాస్క్ ఆన్, యాక్షన్’’ అంటూ మెరిసిపోయారు.
‘‘ఇకపై చిత్రీకరణలన్నీ కొత్త నిబంధనలను అనుసరించే సాగుతాయి. ఇది చాలా కష్టమైన సమయం. కానీ, పని కొనసాగించాలి’’ అని ఆ వీడియోకు ఓ కామెంట్ కూడా జోడీంచారు. ఈ చిత్రం కథ కూడా ఓ సస్పెన్స్, థ్రిల్లర్తో కథ తెరకెక్కుతోంది. 80ల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ . వాణీ కపూర్ హీరోయిన్ కాగా.. హుమా ఖురేషి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. మోనిషా అడ్వాణి, మధు బోజ్వానీ, నిఖిల్ అడ్వాణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
స్కాట్ ల్యాండ్ జరుగుతున్న షూటింగ్ మొత్తం 120 సిబ్బంది పనిచేస్తున్నారు. వారంతా కరోనా నిబంధనలను తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో పనిచేస్తున్న చిత్ర యూనిట్ అందరికీ స్పెషల్ రిస్ట్ బ్యాండ్లు అందించారట. దీంతో ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి బ్లడ్ ప్రెషర్, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లెవెల్.. అన్నీ తెలుసుకోవచ్చు. అంతా వైద్యుల పర్యవేక్షణలో వీరు స్కాట్ ల్యాండ్ టూర్ జరుగుతోంది.