AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఆరేళ్లు నరకం.. తేల్లు, బొద్దింకలు తిన్నా.. బోల్డ్ సీన్స్ చేయడానికి రీజన్ అదే.. టాలీవుడ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇన్నాళ్లు సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే పోషించిన అమ్మాయిలు.. ఇప్పుడు హీరోయిన్లుగా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం నార్త్ బ్యూటీలకు గట్టిపోటీనిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : ఆరేళ్లు నరకం.. తేల్లు, బొద్దింకలు తిన్నా.. బోల్డ్ సీన్స్ చేయడానికి రీజన్ అదే.. టాలీవుడ్ హీరోయిన్..
Kamakshi Bhaskarla
Rajitha Chanti
|

Updated on: Jan 02, 2026 | 7:28 PM

Share

ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటున్న తారలలో కామాక్షి భాస్కర్ల ఒకరు. నిజానికి ఈ అమ్మడు డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మా ఊరహి పొలిమేర సినిమాతో తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. 1995 జూన్ 18న హైదరాబాద్ లో జన్మించిన కామాక్షి.. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుంది. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి.. అక్కడే కొన్నాళ్లు డాక్టర్ గా సేవలు అందించారు. ఆ తర్వాత అపోలో హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేసి ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు.

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

ఇవి కూడా చదవండి

2018లో మిస్ తెలంగాణగా ఎంపికయ్యారు. అదే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మా ఊరి పొలిమేర సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె బోల్డ్ సీన్లలో ఏమాత్రం మొహమాటం లేకుండా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే ఆ సినిమా సీక్వెల్ లోనూ మరోసారి తన నటనతో పాపులర్ అయ్యారు. అటు దర్శకురాలిగా, సింగర్ గా, నటిగా మల్టీటాలెంటెడ్ బ్యూటీగా మారింది.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

అయితే చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు పడినట్లు తెలిపింది. ఆరేళ్లపాటు చైనాలో ఉన్నప్పుడు తేల్లు, బొద్దింకలు ఫుడ్ రుచి చూసినట్లు తెలిపారు. అలాగే మా ఊరి పొలిమేర సినిమాలో బోల్డ్ సీన్స్ చేయడంపై పెద్ద రచ్చ జరిగిందని.. నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని తెలిపింది. సినిమాలో భాగం కాబట్టి ఆ సీన్స్ చేయాల్సి వచ్చిందని.. కథకు కీలకం అని చేసినట్లు తెలిపింది. ఆ సీన్ కు ప్రొడక్షన్ వ్యాల్యూస్ తక్కువగా ఉండడం వల్ల జనాలకు సరిగ్గా కన్వే చేయలేకపోయామని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

Follow Us