AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APFTDC : నంది అవార్డుల వేడుక నిర్వాహణ.. ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక నిర్ణయం..

ఏపీలోని చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్రాభివృద్ధికి నూతన పాలకవర్గం సమావేశమైంది. ఏపీ ఫిలిం, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ APFTDC నూతన పాలకవర్గం మొదటిసారి విజయవాడలోని ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ పలు విషయాలను అధికారికంగా ప్రకటించారు.

APFTDC : నంది అవార్డుల వేడుక నిర్వాహణ.. ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక నిర్ణయం..
Apftdc Directors Meeting
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2026 | 7:25 PM

Share

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం ముందడుగు వేసింది. ఈ మేరకు నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని APFTDC సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ తెలిపారు. ఈ సమావేశానికి కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా, మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్, డైరెక్టర్లు వై. ఝాన్సీ, సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయి మాధవ్, కందిమళ్ల సాంభశివరావు, వివేక్ కూచిభొట్ల, వి. సముద్ర, కే. ఉమామహేశ్వరరావు, ఎస్. వెంకట కృష్ణా రెడ్డి, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ సాహులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

సమావేశంలో రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో పరిశ్రమ పురోగతికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బోర్డు డైరెక్టర్ల సభ్యుల్లో ఒకరు చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ను ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసే ప్ర్రక్రియను పూర్తి చేశామన్నారు. బోర్డు సమావేశానంతరం ఈజీఎమ్ (Extraordinary General meeting) మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు, పెట్టుబడుల ఆకర్షణ, చిత్రీకరణకు అనుకూల వాతావరణం కల్పించడం తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ (రూట్ మ్యాప్) రూపొందించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో ప్రకటించిన నంది అవార్డులు, భవిష్యత్తులో నిర్వహించాల్సిన నంది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివిధ అంశాలు, విధివిధానాలు, సూచనలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించామన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను మరింత బలోపేతం చేయడంతో పాటు కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ప్రోత్సాహం అందించేలా కార్పొరేషన్ కార్యాచరణ కొనసాగుతుందని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారని మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తెలియజేశారు. ఈ సమావేశంలో ఏ.పి. ఫిలిం, టెలివిజన్ , నాటకరంగ అభివృద్ది సంస్థ జనరల్ మేనేజర్ ముడావత్ శ్రీనివాస్ నాయక్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

Follow Us