Tollywood: నిశీదులన్నీ తలొంచే తుషారాణివా.. ఈ అందాల యువరాణి ఎవరో గుర్తుపట్టండి..

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Tollywood: నిశీదులన్నీ తలొంచే తుషారాణివా.. ఈ అందాల యువరాణి ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us

|

Updated on: Nov 12, 2022 | 1:36 PM

పైన ఫోటోలో అందం కూడా అసూయ పడేలా ఉన్న ఆ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా ?.. ప్రేక్షకుల మదిని దొచుకున్న ఈ వయ్యారి తమిళ్ బ్యూటీ. ఓవైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా సందడి చేస్తుంది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఎవరో కనిపెట్టగలరా ?. తెలుగులోనే కాదండోయ్.. తమిళంలోనూ ఈ చిన్నది పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. గుర్తుపట్టండి చూద్దాం.

ఆ ప్రిన్సెస్ మరెవరో కాదు.. హీరోయిన్ నివేదా పేతురాజ్. కోవిల్ పట్టిలో జన్మించింది. 2015లో మిస్ ఇండియా యూఎఇ పోటీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఏడాది ఒరు నాల్ కూతు సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. స్పేస్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన టిక్ టిక్ టిక్ చిత్రానిగానూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ తర్వాత చిత్రలహరి, పార్టీ , బ్రోచేవారెవరురా.. అలా వైకుంఠపురంలో.. బ్లడీ మేరీ, విరాట పర్వం చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం వెండితెరపైనే కాకుండా.. అటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ అలరిస్తుంది నివేదా.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.