AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరే.. టాలీవుడ్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? చిరుతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

18 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగుతో ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది.

Tollywood: అరే.. టాలీవుడ్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? చిరుతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 18, 2025 | 1:50 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రాజేష్ ఖన్నా, సన్ని డియోల్ వంటి అగ్ర హీరోలతో తెరను పంచుకుంది. తన అందం, అభినయంతో 1990వ దశకంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా సంచలనం రేపింది. తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా ఫిల్మ్ పేర్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు కూడా అందుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కింది. అంతే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసిందీ అందాల తార. ఈ అందాల తార చివరిగా 1998లో ఓ సినిమాలో కనిపించింది. అంటే ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు 27 ఏళ్లకు పైగానే అయ్యింది. అయితే ఇప్పటికీ చాలా మంది సినీ అభిమానులు ఈ సొగసరిని గుర్తు పెట్టుకున్నారంటే ఆమె చేసిన సినిమాలే. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆపద్భాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్‌లో 50 కు పైగా సినిమాల్లో నటించిన మీనాక్షి శేషాద్రి శోభన బాబు జీవన పోరాటం సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఆపద్బాంధవుడు సినిమాలో కలిసి నటించింది. ఇందులో ఆమె అందం, అభినయం తెలుగు ఆడియెన్స్ ను కట్టి పడేసింది. వీటి తర్వాత సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన విశ్వామిత్ర మూవీలో మేనక పాత్ర పోషించింది మీనాక్షి.

మీనాక్షి శేషాద్రి లేటెస్ట్ ఫొటోస్..

కాగా 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తితో కలిసి పెళ్లిపీటలెక్కింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ఇప్పుడు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయ మూలాలు మరవని మీనాక్షి విదేశాల్లో ఆసక్తి ఉన్నవారికి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలు నేర్పుతున్నారు. అంతేకాదు వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే అప్పటికీ, ఇప్పటికీ మీనాక్షి చాలా మారిపోయింది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు