Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam Song: ప్రభాస్ అభిమానులకు గుడ్‏న్యూస్.. రాధేశ్యామ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసిందిగా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే

Radhe Shyam Song: ప్రభాస్ అభిమానులకు గుడ్‏న్యూస్..  రాధేశ్యామ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసిందిగా..
Radhey Shyam
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 15, 2021 | 9:51 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంటి విడుదలైన పోస్టర్స్, టీజర్ యూట్యూబ్‏లో నయా రికార్డ్స్ సృష్టించాయి. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీ లో జ‌రిగే ప్రేమ‌క‌థ గా తెరకెక్కుతున్న మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా.. ఇందులో ప్రభాస్ న్యూలుక్‏లో కనిపించబోతుండడంతో.. డార్లింగ్‏ను వెండితెరపై చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే కరోనా ప్రభావంతో వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా.. జనవరి 14న విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిత్రయూనిట్.. దర్శకుడిని తెగ వేడుకున్నారు. అప్డేట్ ఇవ్వాలంటూ నెట్టింట్లో కామెంట్స్ ద్వారా చిన్నపాటి యుద్ధమే చేశారు. దీంతో రాధేశ్యామ్ చిత్రయూనిట్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఈ రాతలే పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ రాతలే అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ పాటను యువన్‌ శంకర్‌ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందించారు. అయితే ఈ సాంగ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అనుకున్న సమయానికి పాటను విడుదల లేదు. ప్రభాస్ అభిమానులకు సారీ చెబుతూ..8 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరోసారి అభిమానులకు నిరాశే కలిగించారు. 8 గంటలకు కూడా ఈ పాటను విడుదల చేయలేదు. ఇక కాసేపటి క్రితం రాధేశ్యామ్ నుంచి ఈ రాతలే పాటను విడుదల చేసింది చిత్రయూనిట్.

Also Read: Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో చరిత్ర సృష్టించిన సబ్ ఇన్‏స్పెక్టర్.. తొలి విజేత ఎవరంటే..

Malaika Arora: హీరోయిన్ చెంపలు పట్టుకుని లాగిన బాలుడు.. షాక్‏లో మలైకా.. చివరకు ఏం చేసిందంటే..

Samantha: వరుస ఆఫర్లలతో సమంత బిజీ బిజీ.. రాజమౌళి సినిమాలో హీరోయిన్‏గా సామ్ ?..

Suriya Jai Bheem: వివాదంలో సూర్య జై భీమ్.. రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతున్న వన్నియార్ సంగం..