Drishyam 2: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. మరోసారి సస్పెన్స్ అదిరిపోయిందిగా..
సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్గా వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా దృశ్యం 2. ఇందులో మీనా, నదియా

సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్గా వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా దృశ్యం 2. ఇందులో మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 240 దేశాల్లో ఉన్న ప్రైమ్ మెంబర్స్ ఈ సినిమాను చూడపోతున్నారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తుండగా.. మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకువస్తారు పోలీసులు. ఇక దృశ్యం 2 ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ సస్పెన్స్తో సాగిపోయింది. ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? కథలో ప్రతీ మలుపు అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Kamal Haasan: భారీ మల్టీస్టారర్ నిర్మించేందుకు సిద్ధమైన కమల్ హాసన్.. ఆ స్టార్ హీరోలెవరంటే..
Samantha in Pushpa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. పుష్పరాజ్తో స్టెప్పులేయనున్న సమంత…
Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..




