Charmy- Ravi Teja: హీరో రవితేజను అన్ ఫాలో చేసిన ఛార్మి.. మంచి స్నేహితుల మధ్య మనస్పర్థలకు కారణం అదేనా?
టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజతో ఛార్మీకి మంచి అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరు చంటి సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే దొంగల ముఠాలోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారు. అలాంటి వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని తెలుస్తోంది. తాజాగా ఛార్మీ హీరో రవితేజతో పాటు ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ని ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేసింది.
![Charmy- Ravi Teja: హీరో రవితేజను అన్ ఫాలో చేసిన ఛార్మి.. మంచి స్నేహితుల మధ్య మనస్పర్థలకు కారణం అదేనా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ravi-teja-charmi-kaur.jpg?w=1280)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఛార్మీ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిందీ అందాల తార. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తునే నిర్మాతగానూ మారిందీ ముద్దుగుమ్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో కో ప్రొడ్యూసర్గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. అక్కడితో నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఛార్మీ ప్రస్తుతం నిర్మాతగానే సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజతో ఛార్మీకి మంచి అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరు చంటి సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే దొంగల ముఠాలోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారు. అలాంటి వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని తెలుస్తోంది. తాజాగా ఛార్మీ హీరో రవితేజతో పాటు ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ని ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేసింది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉన్న వీరి మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేసింది అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
కాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ కూడా థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. దీనికి సంబంధించి కొన్నిరోజుల క్రితం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇదే ఇప్పుడు రవితేజ, ఛార్మీల మధ్య మనస్పర్థలకు దారి తీసిందని తెలుస్తోంది. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాగా హరీశ్ శంకర్ కు పూరీ జగన్నాథ్ శిష్యుడిగా పేరుంది. అలాగే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే సినిమాల విడుదల విషయంలో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయని తెలుస్తోంది.
డబుల్ ఇస్మార్ట్ మూవీ సెట్ లో ఛార్మీ.. వీడియో..
All the fun, madness and everything that went behind bringing you all the 𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISmartTeaser 🔥
Here’s a special making video from the sets of #DoubleISMART ❤️🔥
Ustaad @ramsayz #PuriJagannadh @duttsanjay @KavyaThapar… pic.twitter.com/5KiMnPuPWm
— Puri Connects (@PuriConnects) May 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.