AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసి నచ్చిన రంగంలో సెటిల్ అయ్యింది. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్ గా పనిచేస్తుంది.

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..
Reshma Rathore
Rajitha Chanti
|

Updated on: Jul 17, 2025 | 7:56 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా మెప్పించింది. ఎన్నో సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. అయినప్పటికీ యంగ్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత రాజకీయాల్లో చేరింది. అదే సమయంలో అటు లాయర్ కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రేష్మ రాథోడ్.

రేష్మ రాథోడ్.. ఈ పేరు అంతగా గుర్తుకు ఉండకపోవచ్చు. కానీ ఈరోజుల్లో సినిమా బ్యూటీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. రేష్మ రాథోడ్.. అచ్చ తెలుగమ్మాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆమె వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2012లో బాడీగార్డ్ సినిమాలో త్రిష స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి రూపొందించిన ఈరోజుల్లో సినిమాలో మెయిన్ లీడ్ రోల్ పోషించింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

ఫస్ట్ మూవీతోనే గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సరసన జై శ్రీరామ్ మూవీలో కనిపించింది. ఆ త్రవాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించింది. 2017 తర్వాత మరో సినిమా చేయలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తుంది.

ఇవి కూడా చదవండి : 

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..