రంజాన్ మాసం వేళ సాంప్రదాయ దుస్తుల్లో హీరోయిన్.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?
ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మడే.. రంజాన్ మాసం సందర్భంగా ఇలా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఈ అమ్మడిని గుర్తుపట్టడం కాస్త కష్టమే

హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మడే.. రంజాన్ మాసం సందర్భంగా ఇలా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఈ అమ్మడిని గుర్తుపట్టడం కాస్త కష్టమే ఇంతకు మీరు గుర్తుపట్టారా..? ఆ చిన్నది ఎవరో..? తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఎవరంటే..
పై ఫొటోలో ఉన్న భామ ఎవరో కాదు ఆ అమ్మడు హెబ్బా పటేల్స్. రంజాన్ మాసం సందర్భంగా ఇలా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది . 2014 వచ్చిన ‘అలా ఎలా ?’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హిట్ అందుకుంది ఈ ముంబై బ్యూటీ. తన చలాకీతనంతో… నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ సినిమా తర్వాత హెబ్బా పటేల్ సినిమాల విషయంలో కాస్తా తప్పటడుగులు వేసింది. దీంతో ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించకుండా పోయింది. ఇటీవల నితిన్ ‘భీష్మ’ సినిమాల తలుక్కున మెరిసి.. రామ్ ‘రెడ్’ సినిమాలో కనిపించింది.కెరీర్ ప్రారంభంలో ‘కుమారి 21 ఎఫ్’, ‘ఈడోరకం, ఆడోరకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత హెబ్బా పటేల్.. ఆతర్వాత ఆశించిన స్థాయిలో హిట్స్ అందుకోలేక పోయింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.
View this post on Instagram
