AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం అంటే ఈ అమ్మడిదే..! అక్కినేని హీరోలు ముగ్గురితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. సినీరంగంలో అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు నాగార్జున. దివంగత హీరో నాగేశ్వర రావు నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ అందకున్నారు. 90’s లో నాగార్జున క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

అదృష్టం అంటే ఈ అమ్మడిదే..! అక్కినేని హీరోలు ముగ్గురితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
Akkineni Heroes
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2025 | 9:35 PM

Share

అక్కినేని ఫ్యామిలీ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు కింగ్ నాగార్జున, మరో వైపు ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.  నాగార్జున ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమాలో నటిస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలోనూ నటిస్తున్నారు నాగ్. అలాగే బిగ్ బాస్ షో హోస్ట్ గా చేసి ఆకట్టుకున్నారు నాగ్. ఇక నాగ చైతన్య తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరో వైపు అఖిల్ కూడా నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అఖిల్ నటించిన  ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు అఖిల్. మొన్నామధ్య నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్నాడు. తాజాగా అఖిల్ తాను ప్రేమించిన జైనబ్ రవ్జీ మెడలో మూడుముళ్లు వేశాడు.

ఇదిలా ఉంటే అక్కినేని ముగ్గురు హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలో తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కాగా అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ మాత్రం ఈ అమ్మడే.. ఆమె బుట్టబొమ్మ పూజాహెగ్డే.

అవును పూజాహెగ్డే నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అదేవిధంగా నాగార్జునతో సినిమాల్లో నటించలేదు కానీ యాడ్స్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ చిన్నది. నాగ్, పూజా కలిసి కొన్ని యాడ్స్ చేశారు. ఇలా బుట్టబొమ్మ పూజా హెగ్డే అక్కినేని ముగ్గురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ అమ్మడు వరుస ఫ్లాప్స్ పలకరించడంతో స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం పూజా హెగ్డే దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి