AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి మాస్ మావ..! ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. స్టార్స్ లేకుండానే బ్లాక్ బస్టర్

హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలోకి హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ అడియన్స్ ఎక్కువగా ఇష్టపడే జానర్స్ లో హారర్ ప్రధానం. అందుకే తెలుగుతోపాటు ఇతర భాషలలో విడుదలైన హారర్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తున్నారు.

ఇదెక్కడి మాస్ మావ..! ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. స్టార్స్ లేకుండానే బ్లాక్ బస్టర్
Web Series
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2025 | 4:40 PM

Share

ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెల రోజులకు ఓటీటీల్లో విడుదలై పేక్షకులను అలరిస్తున్నాయి. ఇక సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తుంటే.. వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ ల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే వెబ్ సిరీస్ మాత్రం చాలా డిఫరెంట్.. ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ లో పెద్ద పెద్ద స్టార్స్ లేరు.. కానీ ఓటీటీలో టాప్ లో ఉంది ఈ సిరీస్. ఇంతకూ అది ఏంటంటే..

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

ఈ వెబ్ సిరీస్ ఓ కోర్టు డ్రామా.. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఊహించని ట్విస్ట్ లు ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ పై కూర్చోబెడతాయి.  2025లో ఇండియాలో ఎక్కువ పేక్షకులు చూసిన సిరీస్ గా నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ వెబ్ సిరీస్ ఏకంగా 27.7 మిలియన్ల యూనిక్‌ యూజర్లతో టాప్ ప్లేస్ లో చోటు సంపాదించుకుంది. ఇంతకూ ఈ వెబ్ సిరీస్ ఎదో కాదు. బాలీవుడ్ లో తెరకెక్కిన క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్. ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటించారు.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఓర్మాక్స్ మీడియా టాప్ 50 స్ట్రీమింగ్ ఒరిజినల్స్ లిస్ట్ లో క్రిమినల్ జస్టిస్ టాప్ లో ఉంది. ఈ కోర్టు డ్రామా 27.7 మిలియన్ల యూనిక్‌ యూజర్లను ఆకట్టుకుంది. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ తర్వాత పంచాయత్ సీజన్ 4’ 23.8 మిలియన్ల యూజర్లతో, బాబీ డియోల్ నటించిన ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2’ 27.1 మిలియన్ల వ్యూయర్స్ తో టాప్ లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us