AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కష్టాలు ఎదురైన చెరగని చిరునవ్వు ఈమె సొంతం.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఏదో మాయ చేసింది. స్టార్ హోదా సంపాదించినా.. పక్కింటమ్మాయ్‌లాగే కనిపించి సందడి చేసింది..

Tollywood: కష్టాలు ఎదురైన చెరగని చిరునవ్వు ఈమె సొంతం.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
Tollywood
Ravi Kiran
|

Updated on: Apr 11, 2023 | 5:47 PM

Share

తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఏదో మాయ చేసింది. స్టార్ హోదా సంపాదించినా.. పక్కింటమ్మాయ్‌లాగే కనిపించి సందడి చేసింది. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత సినీ కెరీర్ పీక్స్‌లో ఉండగా పెళ్లి చేసుకుంది. అనంతరం వ్యక్తిగత జీవితంలో పలు ఒడిదుడుకులను సైతం ఎదుర్కుంది. అయితేనేం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తన ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు చెరగలేదు. అన్నింటినీ జయించి స్ట్రాంగ్‌గా నిలిచింది.. ఇప్పుడొక పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఆమెవరో గుర్తుపట్టారా.?

ఇప్పటికైనా కనిపెట్టగలిగారా.? ఎస్.! మీరనుకున్నది కరెక్టే.. ఆమె మరెవరో కాదు సమంత. 2010లో ‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగులోకి పరిచయమైన ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘S/O సత్యమూర్తి’, ’24’, ‘అఆ’, ‘రంగస్థలం’, ‘యూ టర్న్’, ‘సూపర్ డీలక్స్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి

అటు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో ఊ అంటావా.. ఊఊ అంటావా అనే ఐటెం సాంగ్ చేసి.. దేశవ్యాప్తంగా సూపర్బ్ క్రేజ్‌ను సంపాదించింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.