Tollywood: పవన్, రవితేజ కాంబోలో హిట్ మల్టీస్టారర్.. కొద్దిలో మిస్.! ఆ మూవీకి డైరెక్టర్ ఎవరో తెల్సా
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో గతంలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట.
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, రవితేజలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ మిస్ అయింది. దానికి లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటో తెల్సా..
ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ స్టార్ హీరో ఆరాటపడుతుంటాడు. దర్శకుడు మణిరత్నం తన కెరీర్లో ఎన్నో మల్టీస్టారర్ మూవీలు చేశాడు. వాటిల్లో ఒకటి ‘యువ’. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలో సూర్య, మాధవన్, సిద్దార్థ్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందించగా.. హిందీలో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్ కాంబోలో తెరకెక్కింది. అలాగే దీన్ని తెలుగులో మొదట పవన్ కళ్యాణ్, రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించాలని దర్శకుడు అనుకున్నాడట. కానీ చివరి నిమిషంలో అది వర్కౌట్ కాలేదు.
సూర్య పాత్రలో పవన్ కళ్యాణ్, మాధవన్ పాత్రలో రవితేజను తీసుకోవాలని మణిరత్నం ప్లాన్ చేశాడట. వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. కానీ ఏం జరిగిందో ఏమో.. లాస్ట్ మినిట్లో తమిళ చిత్రాన్నే తెలుగులో డబ్ చేశారు. ఇక ఆ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అందుకుంది. ఆల్ టైం క్లాసిక్గా కూడా నిలిచింది. కాగా, పొనియన్ సెల్వన్ సిరీస్తో బౌన్స్ బ్యాక్ అయిన దర్శకుడు మణిరత్నం.. ప్రస్తుతం కమల్ హాసన్తో థగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇది చదవండి: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి