Ram Gopal Varma: అవతార్‌ 2పై మరో ట్వీట్‌ చేసిన ఆర్జీవీ.. అలా మాటిస్తే మనుషులందరూ ఇప్పుడే చచ్చిపోతారంటూ..

ఈ సినిమా చూసి కొన్నిసార్లు థీమ్ పార్క్‌కు వెళ్లినట్లు ఫీలయ్యా. అది నాకు చెడుగా మాత్రం అనిపించలేదు' అని సినిమాపై తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశాడు ఆర్జీవీ. తాజాగా ఈ విజువల్‌ వండర్‌ మూవీపై మరోసారి ట్వీట్‌ చేశాడీ సీనియర్‌ డైరెక్టర్‌.

Ram Gopal Varma: అవతార్‌ 2పై మరో ట్వీట్‌ చేసిన ఆర్జీవీ.. అలా మాటిస్తే మనుషులందరూ ఇప్పుడే చచ్చిపోతారంటూ..
Ram Gopal Varma
Follow us

|

Updated on: Dec 18, 2022 | 4:35 PM

జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన అవతార్‌ 2-ది వే ఆఫ్‌ వాటర్‌ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతోంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి చిత్రబృందాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ జాబితాలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఉన్నారు. ఇప్పటికే సినిమాను చూసిన ఆయన తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘అవతార్‌-2 ను సినిమా అని పిలిస్తే అది కచ్చితంగా నేరమే అవుతుంది. ఎందుకంటే ఆ విజువల్స్, యాక్షన్స్ ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఈ సినిమా చూసి కొన్నిసార్లు థీమ్ పార్క్‌కు వెళ్లినట్లు ఫీలయ్యా. అది నాకు చెడుగా మాత్రం అనిపించలేదు’ అని సినిమాపై తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశాడు ఆర్జీవీ. తాజాగా ఈ విజువల్‌ వండర్‌ మూవీపై మరోసారి ట్వీట్‌ చేశారు వర్మ

‘అవతార్‌-2’లో అందమైన నీటి ప్రపంచాన్ని చూపించారు. అద్భుతమైన విజువల్స్‌, ఆకట్టుకునే నటుల ప్రదర్శన.. ఊపిరి బిగబెట్టేలా ఉన్న యాక్షన్‌ సీన్లు.. ఇలా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమా సాగింది. దేవుడు ఈ భూమిని సృష్టిస్తే.. పండోరా అనే అందమైన ప్రపంచాన్ని జేమ్స్‌ కామెరూన్‌ క్రియేట్‌ చేశాడు. ఈ ప్రపంచంలో నివసించాలని ఉంది. అవతార్‌-2 చూసిన తర్వాత స్వర్గం అంటే పండోరా వలే ఉంటుందని ఎవరైనా మాటిస్తే.. మనుషులందరూ చచ్చిపోతారు’ అని తనదైనశైలిలో ట్వీట్‌ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2009లో విడుదలైన అవతార్‌ కు సీక్వెల్‌గా జేమ్స్‌ కామెరూన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం (డిసెంబర్‌ 16) విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు వస్తున్నాయి. సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులోనూ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమాను మంచు విష్ణు, సుమ కనకాల వీక్షించారు. ఇదొక విజువల్‌ వండర్‌ అని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్‌లో దీనిని చూడాలని తమ అభిప్రాయాన్ని తెలిపారు.

ఇవి కూడా చదవండి
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు