Mahesh Babu- Rajamouli: మహేష్ ఫ్యాన్స్కు ఇక పూనకాలే.. సూపర్ స్టార్ సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన జక్కన్న..
ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన తెరకెక్కించే మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచమే ఎదురుచూస్తుంది. అలాగే ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ రెంజ్లో ఉండనుందని రాజమౌళి చెప్పడంతో అభిమానుల్లో
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన తెరకెక్కించే మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచమే ఎదురుచూస్తుంది. అలాగే ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ రెంజ్లో ఉండనుందని రాజమౌళి చెప్పడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మహేష్ ఫ్యాన్స్కు కిక్కిచ్చే అప్డేట్స్ ఇచ్చాడు జక్కన్న. ఈ సినిమా గురించి ఆసక్తిక విషయాలను బయటపెట్టారు.
జక్కన్న మాట్లాడుతూ.. ” నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో చాలా వాటికి మా నాన్నే రచయిత.. ఇక ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా ఆయనే రచయిత. కొన్ని నెలల క్రితమే కథ రాయం స్టార్ట్ చేశారు. ఆయన నేను డెవలప్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాం. ఇదొక అడ్వెంచర్ కథ. చాలా కాలంగా ఈ జోనర్లో సినిమా చేయాలని ఉంది. ఇండియానా జోన్స్ నాకు ఇష్టమైన సినిమా ” అంటూ చెప్పుకొచ్చారు.
హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవంలో రాజమౌళి పాల్గొన్నారు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఈ వేడుకలలో కార్తికేయతో కలిసి సందడి చేశారు జక్కన్న. ఆస్కార్ అవార్డులకు ముందు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందిస్తోన్న ప్రముఖులకు అకాడమీ ఈ అవార్డును అందజేయడం ఆనవాయితీ. మరోవైపు ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.