AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..

దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం తన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గమ్యం సినిమా చేసేటప్పుడు తాను అనుభవించిన ఒత్తిడిని, కారులో ఒంటరిగా అరిచిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్‌లో తాను కోపంగా మాట్లాడటానికి కారణం తెలుగు ప్రజల చరిత్రను గర్వంగా చాటాలనే ఆవేదన అని తెలిపారు.

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..
Krish
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2026 | 8:38 PM

Share

దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఓ ఇంటర్వ్యూలో తన చలనచిత్ర ప్రయాణంలో ఎదురైన అనేక అనుభవాలను, వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు. గమ్యం సినిమా నిర్మాణ సమయంలో తాను తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానని, ఒక సందర్భంలో కారులో ఒంటరిగా గట్టిగా అరిచానని తెలిపారు. అది కేవలం ఒక ఒత్తిడి పరిస్థితి అని, ఆ సంఘటనను పూర్తిగా గుర్తుంచుకోలేదని పేర్కొన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్‌లో తన ఆవేశపూరిత ప్రసంగం గురించి వివరించారు. అది తెలుగువారి గతం, మూలం, చరిత్రను గర్వంగా చెప్పాల్సిన కథ అని, దానిని చెప్పలేదనే ఆవేదనతోనే అలా మాట్లాడానని స్పష్టం చేశారు. తన లక్ష్యం ఉత్తర భారతదేశంలో ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను గుర్తించని వారికి తెలుగు ప్రజల గొప్పతనాన్ని చాటిచెప్పడమేనని తెలిపారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ గారి లుక్ డిజైన్ గురించి మాట్లాడుతూ, కాన్సెప్ట్ ఆర్టిస్టులతో చేయించామని, బాలయ్య గారి సలహాలు కూడా తీసుకున్నామని చెప్పారు. లండన్ మ్యూజియంలోని మెకంజీ రాతప్రతులు, కుడ్య చిత్రాలను పరిశీలించి కాస్ట్యూమ్స్, ఆభరణాలను రూపొందించామని వెల్లడించారు. ఒక యుగ పురుషుడిని చూస్తున్న అనుభూతి కలిగించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

కంచె సినిమా డైలాగ్స్ గురించి ప్రస్తావిస్తూ, సాయి మాధవ్ బుర్రా గారు రాశారని, కంటెంట్ తనదైతే ఆయన దానికి రూపకల్పన చేస్తారని వివరించారు. గులాబ్ పువ్వు నచ్చితే కోసుకుంటాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం అనే డైలాగ్ ఒక కొటేషన్ అని, తన సొంతం కాదని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో అత్యంత సంతోషకరమైన సంఘటనగా గమ్యం సినిమా విడుదలైన తర్వాత ఒక సామాన్యుడు “వీడు ఎవడో తెగ పుస్తకాలు చదివాడు, భలే తీశాడురా సినిమా” అని పొగడటాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ప్రస్తుతం చాలా మంది ఆశపడే స్థితిలో ఉన్నానని, కథలు చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశంగా దీనిని చూస్తానని తెలిపారు. వృత్తిపరంగా తనకు పెద్ద బాధాకర సంఘటనలు లేవని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

వ్యక్తిగత జీవితంలో తన తాతయ్య మరణం అత్యంత బాధాకరమైనదని, ఆయన ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అని, అనేక అవార్డులు గెలుచుకున్నారని తెలిపారు. ఆయనతో తన బాల్య జ్ఞాపకాలను పంచుకుంటూ, ప్రతి ఆదివారం వార్తాపత్రికలు చదివి సరిచేయడం, పెద్ద ఉమ్మడి కుటుంబంలో అందరితో కలిసి ఒకే కంచంలో భోజనం చేయడం వంటివి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది..జబర్దస్త్ కమెడియన్..

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

Follow Us