Gopichand Malineni: బాలయ్య సినిమా టిక్కెట్ల కోసం ఈ డైరెక్టర్ రెండు రోజులు జైల్లో ఉన్నాడట..

ఒక్క సినిమాతో అటు రవితేజకు, ఇటు హీరోయిన్ శ్రుతిహాసన్ కు సాలిడ్ హిట్ అందించారు దర్శకుడు గోపీచంద్ మలినేని.

Gopichand Malineni: బాలయ్య సినిమా టిక్కెట్ల కోసం ఈ డైరెక్టర్ రెండు రోజులు జైల్లో ఉన్నాడట..
Gopichand
Follow us

|

Updated on: Nov 28, 2021 | 4:27 PM

Gopichand Malineni: ఒక్క సినిమాతో అటు రవితేజకు, ఇటు హీరోయిన్ శ్రుతిహాసన్ కు సాలిడ్ హిట్ అందించారు దర్శకుడు గోపీచంద్ మలినేని. గోపీచంద్ దర్శకత్వం వహించిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మాస్ రాజాకు కలిసొచ్చిన పోలీస్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయం తర్వాత నటసింహం తో సినిమా చేస్తున్నారు గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ తో గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కారక్యక్రమానికి గోపీచంద్ మలినేని కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ..  ఎన్బీకే అంటే ఒక వైబ్రేషన్ .. ఎన్బీకే అంటే ఒక ఎనర్జీ .. ఎన్బీకే అంటే ఒక విస్ఫోటనం అన్నారు. నేను ఒక దర్శకుడిగా ఇక్కడికి రాలేదు ఓ అభిమానిగా వచ్చెను అన్నారు గోపీచంద్. బాలయ్య బాబుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని .. ‘సమరసింహా రెడ్డి’ సినిమా టిక్కెట్ల కోసం రెండు రోజుల పాటు నేను ‘ఒంగోలు’ జైల్లో  లో ఉన్నాను అన్నారు గోపీచంద్. నేను కూడా డిసెంబర్ 2 కోసమే వెయిట్ చేస్తున్నాను అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Acharya: సిద్ద వచ్చేశాడు.. “ఆచార్య” పై అంచనాలను పెంచేసిన రామ్ చరణ్ టీజర్

Swara Bhaskar: అలా చేసినందుకు ఎండార్స్‌మెంట్‌ కాంట్రాక్టులన్నీ రద్దయ్యాయి.. బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌

D. Suresh Babu : అందుకే “దృశ్యం 2” సినిమాను థియేట్సర్స్‌కు ఇవ్వలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన సురేష్ బాబు..