AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshit Shetty: కన్నడ హీరో రక్షిత్ శెట్టికి హైకోర్టు షాక్..  రూ.20 లక్షలు కట్టాలని ఆదేశం.. ఎందుకంటే..

ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 20 లక్షల రూపాయలను కోర్టులో డిపాజిట్ చేయాలని రక్షిత్ శెట్టి, 'పరంవ స్టూడియోస్'కు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి 'MRT మ్యూజిక్' సంస్థ ఒక ప్రకటన ద్వారా సమాచారాన్ని పంచుకుంది. 'బ్యాచిలర్ పార్టీ' కన్నడ చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.

Rakshit Shetty: కన్నడ హీరో రక్షిత్ శెట్టికి హైకోర్టు షాక్..  రూ.20 లక్షలు కట్టాలని ఆదేశం.. ఎందుకంటే..
Rakshit Shetty
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2024 | 9:57 PM

Share

కన్నడ హీరో రక్షిత్ శెట్టి కాపీ రైట్ ఉల్లంఘన కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బెంగుళూరులోని యశ్వంత్ పూర్ పోలీస్ స్టేషన్లో ఈ హీరోపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో రక్షిత్ శెట్టిని పిలిపించి పోలీసులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రక్షిత్ శెట్టి, ‘MRT మ్యూజిక్’ కంపెనీ మధ్య న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. ‘పరంవ స్టూడియోస్‌’ నిర్మిస్తున్న ‘బ్యాచిలర్‌ పార్టీ’ సినిమాలో ‘ఎమ్‌ఆర్‌టి మ్యూజిక్‌’కి చెందిన రెండు పాటలను అనుమతి లేకుండా వాడుకున్నారని రక్షిత్ శెట్టిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 20 లక్షల రూపాయలను కోర్టులో డిపాజిట్ చేయాలని రక్షిత్ శెట్టి, ‘పరంవ స్టూడియోస్’కు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి ‘MRT మ్యూజిక్’ సంస్థ ఒక ప్రకటన ద్వారా సమాచారాన్ని పంచుకుంది. ‘బ్యాచిలర్ పార్టీ’ కన్నడ చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. ఆ సినిమాలో ‘న్యాయ ఎల్లిదయా..’, ‘ఒమ్మే నేహిందే..’ పాటలను వాడుకున్నందుకు ‘ఎంఆర్‌టీ మ్యూజిక్‌’ రక్షిత్ శెట్టిపై కేసు పెట్టింది.

అయితే తనపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలపై కోర్టులో సమాధానం చెప్పాలని రక్షిత్ శెట్టి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ రెండు పాటలను సినిమాలో వాడుకున్నట్లు వీడియో క్లిప్‌ను షేర్ చేశాడు. తాజాగా వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. ‘సినిమాలో అనుమతి లేకుండా పాటలను ఉపయోగించడమే కాకుండా పాటలోని శకలాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా రక్షిత్ శెట్టి, పరమవ స్టూడియోలు మరోసారి కాపీరైట్‌ను ఉల్లంఘించాయి’ అని ఎంఆర్‌టి మ్యూజిక్ కంపెనీ కోర్టులో వాదించింది. ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ రక్షిత్ శెట్టి లేదా పరమవ స్టూడియోస్ విచారణకు హాజరు కాలేదని చెబుతున్నారు.

రక్షిత్ శెట్టి నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నారు. ఇంతకు ముందు కూడా పాటల విషయంలో కోర్టుకెళ్లాడు. ఇలా పదే పదే కేసులు నమోదవుతుండడంతో కాపీరైట్ విషయంలో క్లారిటీ రావాలన్నది రక్షిత్ శెట్టి ఉద్దేశం. ఢిల్లీ కోర్టు ఆదేశాలపై ఆయన ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.