AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bhim: 37 ఏళ్ల ఘటనను గుర్తుచేసింది.. జైభీమ్ మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన..

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో

Jai Bhim: 37 ఏళ్ల ఘటనను గుర్తుచేసింది.. జైభీమ్ మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన..
Jaibheem
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2021 | 1:53 PM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇందులో సూర్య నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 1993లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మంచి టాక్‏తో.. ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ గురించి సీపీఐ జాతీయ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. జైభీమ్ సినిమా .. తన జీవితంలో జరిగిన ఘటనను గుర్తుచేసిందన్నారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. జైభీమ్ సినిమా చూశాను. నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్లు లేవు. ఉన్నతమైన నేటి సమాజం, ప్రత్యేకంగా యువ న్యాయవాది సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యతను, సందేశాత్మక సంకేతాలనే జై భీమ్ సినిమా సమాజానికి పంపింది. ప్రజా ఉద్యమాల్లోనే ఉంటున్న నాకు ఈ సినిమాలోని ఒక ఘట్టానికి అవినాభావ సంబంధం ఉంది. 37 ఏళ్ల కిందటి ఘటన కళ్ళముందు కదలాడింది. సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఎలాగైనా ఉపసంహరింప చేయాలని పోలీస్ బాస్… నీ భర్త ఎటు రాడు… కనీసం పరిహారం అందుకొని కోర్టు కేసు ఉపసంహారించుకో అన్న సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు దిమ్మతిరిగేలా ఉంటుంది. ఈ సందర్బంగా నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా వుండగా తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది.

నగరంలో కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ గూడు లేక రాత్రి సమయాల్లో ఏదో ఒక ప్లాట్ ఫారం పై పడుకునే అబాగ్యరాలు..ఒక రోజు రాత్రి బీట్ కానిస్టేబుల్స్ యదావిదిగా తమ లాటీలతో దబాయించుకుంటూ వస్తున్నారు. బిక్షగాళ్ళంతా భయపడి పరుగెత్తారు కోతిని ఆడించుకునే లక్ష్మి పరుగెత్తడానికి ప్రయత్నించే క్రమంలో పోలీసులు ఆమెను కాలితో తన్నడంతో ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ మృతదేహం పక్కన ఆమెకు జీవితం అయిన కోతి మాత్రమే ఉండిపోయింది. అదే సమయానికి సినిమాకు వెళ్ళిన పార్టీ యువజన సంఘం నాయకులు టీ కోసమని బస్ స్టాండుకు వచ్చిన క్రమంలో జరిగిన దారుణం వారి కంట పడింది. విషయం తెలియగానే యువజన నాయకులతో పాటు మేము కూడా ఘటనా స్తలానికి చేరుకున్నాం. తెల్లవారు జామున మృతదేహాన్ని తోపుడుబండిపై పడుకోబెట్టి నిరసన ప్రారంభించాం. నిరసన కేవలం 25 మందితోనే ప్రారంభమైంది. విషయం తెలియడంతో క్రమంగా వందల మంది జాతకలిశారు. లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మరుసటి రోజు బందుకు పిలుపునిచ్చాము. లక్ష్మి అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు ఆమె చేతిలో పెరిగిన కోతి ఆ మృతదేహాన్ని అంటి పెట్టుకొని ఉండడం నా హృదయాన్ని బరువెక్కించింది.

మేము బంద్‏కు పిలుపు ఇచ్చిన రోజునే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‏టి రామారావు తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 11-12 గంటల సమయంలో కొందరు పోలీసులు వచ్చి నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయనికి తీసుకెళ్లారు. అక్కడ ఆనాటి కలెక్టర్ సుబ్బారావ్ గారు, ఎస్పీ ఉన్నారు. వారు నాతో మీరు తలపెట్టిన రేపటి బంద్ పిలుపును ఉపసంహరించుకోండి. నగరంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంది అన్నారు. వారి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. ఆసమయంలో అధికారులు ఇద్దరూ నాతో.. చనిపోయిన లక్ష్మిది ఈప్రాంతం కాదు, ఆస్తిపరూరాలు కాదు, కుల బలం లేదు. ఆలాంటి వ్యక్తి కోసం మీరు పోరాటం చేస్తే మీకు గానీ, మీపార్టీకిగానీ వచ్చే లాభం ఏమిటి అని అడగంతో పాటు పై నుంచి మీపై కేసులు పెట్టడం తప్ప అని వ్యాఖ్యానించారు. వారికి ఒకే సమాధానంగా… “మా ఉద్యమం వలన సామాజిక చైతన్యం కలిగి సామాన్య ప్రజలు కూడా ధైర్యంగా నివసించగలరు. అదే సమయంలో అధికారులు కూడా బాధ్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం అనేసాను.. ఏమిటో ఈయన మార్క్సిజాన్ని తిరగేసి చదువుతున్నారు” అని కామెంట్ కూడా చేశారు. మరుసటిరోజు బంద్ విజయవంతంగా జరిగింది. పోలీసులు ముందుగానే అన్నట్టుగా మాపై కేసులు కూడా పడ్డాయి. చిత్తూరు సబ్ జైలులో వారం పాటు నిర్బందించారు. మా ఉద్యమ సందేశం ఆనాడు నగరంలో హాకర్స్ , రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడడానికి ఊతం ఇచ్చింది. జై భీమ్ సినిమా చుస్తుంటే 37 ఏళ్ల క్రితం పోలీసుల అకృత్యాలకు బలైన లక్ష్మి, నాటి పోరాటం సినిమాగా నా కళ్ల ముందు కదులుతున్నాయని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ.

Also Read: Priyanka Chopra: లాస్ ఏంజెల్స్‏లో భర్తతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న గ్లోబల్ స్టార్.. ప్రశంసిస్తున్న నెటిజన్స్..

Shyam Singha Roy: మాస్ లుక్‏లో అదరగొడుతున్న నాని.. శ్యామ్ సింగరాయ్ సాంగ్ రిలీజ్..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..