Nagarjuna: నాగార్జున పై మాదాపూర్ పోలీస్స్టేషన్లో కంప్లైంట్..
మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులను కోరారు. లీగల్ ఒపీనియన్కు పంపించారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ను ఇటీవలే కూల్చివేసిన విషయం తెలిసిందే.
అక్కినేని నాగార్జున పై మాదాపూర్ పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తమ్మిడికుంట చెరువు కబ్జాచేసి Nకన్వెన్షన్ నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులను కోరారు. లీగల్ ఒపీనియన్కు పంపించారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ను ఇటీవలే కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును కబ్జా చేసి N కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా దాన్ని కూల్చివేసింది.
తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి N కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కాగా దాని పై హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి..కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో కన్వెన్షన్ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు అధికారులు.
కాగా దీని పై నాగార్జున స్పందిస్తూ.. ఆ భూమి పట్టా భూమి అని.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కరరెడ్డి. మరి దీని పై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడలి. మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంత, అక్కినేని ఫ్యామిలీ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో కొండా సురేఖ పై నాగ్ లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి