AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ప్రతి దానికీ ఓ రేటు ఉంటుంది.. ఫొటోగ్రాఫర్ల గురించి అసలు విషయం బయట పెట్టిన జాన్వీ కపూర్

సినీ నటులు, హీరోయిన్స్ ఎయిర్‌పోర్ట్‌కి, జిమ్‌కి, పార్టీలకు, షూటింగ్‌లకు, ఈవెంట్‌లకు వెళ్లి ఎక్కడికెళ్లినా తెగ ఫొటోలు దిగుతారు. అయితే విషయం ఏమిటంటే హీరో, హీరోయిన్స్ ఎక్కడికి వెళ్తున్నారో వారికి ఎలా తెలుస్తుంది.? మరి ఫోటోలు తీయడం వల్ల ఏం లాభం.? ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Janhvi Kapoor: ప్రతి దానికీ ఓ రేటు ఉంటుంది.. ఫొటోగ్రాఫర్ల గురించి అసలు విషయం బయట పెట్టిన జాన్వీ కపూర్
Janhvi Kapoor
Rajeev Rayala
|

Updated on: May 25, 2024 | 7:56 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్స్ ఎగబడుతూ ఉంటారు. ఎక్కువగా బాలీవుడ్ లో హీరోయిన్స్ ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్స్ పోటీ పడుతుంటారు. సినీ నటులు, హీరోయిన్స్ ఎయిర్‌పోర్ట్‌కి, జిమ్‌కి, పార్టీలకు, షూటింగ్‌లకు, ఈవెంట్‌లకు వెళ్లి ఎక్కడికెళ్లినా తెగ ఫొటోలు దిగుతారు. అయితే విషయం ఏమిటంటే హీరో, హీరోయిన్స్ ఎక్కడికి వెళ్తున్నారో వారికి ఎలా తెలుస్తుంది.? మరి ఫోటోలు తీయడం వల్ల ఏం లాభం.? ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్హవి కపూర్ , తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. చాలా ప్రత్యేకమైన సందర్భాలు ఉంటే, ఛాయాచిత్రకారులు కారును అనుసరిస్తూ హీరో, హీరోయిన్స్ ను వెతుక్కుంటూ వస్తారు. కానీ సినిమా ప్రమోషన్ వగైరా ఉంటే డబ్బులు చెల్లించి వారిని పిలవాలి అని తెలిపింది జాన్వీ కపూర్. ఇప్పుడు ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా ప్రమోషన్ జరుగుతోంది. కాబట్టి నా ఫోటోలు క్లిక్ చేయడానికి వారు వచ్చారు.  కానీ సినిమా షూటింగ్ లేనప్పుడు, నేను నా పనిలో బిజీగా ఉన్నప్పుడు వారు నా కారును అనుసరిస్తారు. కష్టపడి నన్ను ఫోటోలు తీస్తారు దీనికి డబ్బులు తీసుకుంటుంటారు.

ప్రతి బాలీవుడ్ సెలబ్రిటీకి ఒక రేట్ ఉంటుంది. స్టార్ యాక్టర్స్ అయితే ఒక రేటు. చిన్న వారికీ ఒక రేటు ఉంటుందని తెలిపింది. స్టార్స్ అయితే మీ కారును వెంబడిస్తూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. పెద్ద స్టార్ కాకపోతే వాళ్లను మీరే పిలవాలి.  గతంలో టాలీవుడ్  నటి ప్రియమణి కూడా దీని గురించి మాట్లాడింది. కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించి అక్కడి ఫోటో గ్రాఫర్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. సెలబ్రిటీలు ఫోటో గ్రాఫర్లకు ఫోన్ చేసి వారి ఫోటోలను తీయించుకుంటారని తెలిపింది. అయితే ఫోటో గ్రాఫర్లు తమ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఫొటోలు క్లిక్ మనిపిస్తారు’ అని తెలిపారు. ఇప్పుడు జాన్హవి కపూర్ కూడా అదే మాట చెప్పింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us