AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: టాస్క్‌లో రచ్చ రచ్చ చేసిన హౌస్ మేట్స్.. ఏడ్చేసిన కిరాక్ సీత

హౌస్ మేట్స్ మధ్య గొడవలు బాగానే జరిగాయి. ఇక ఈ వారంలో విడుదలైన విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క. ఈ ఆరుగురు ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు  మొదటి వారం హౌస్ నుంచి బయటకు రానున్నారు. వీరిలో పృథ్వీ, బెజవాడ బేబక్క డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈవారం ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారో చూడాలి

Bigg Boss Telugu 8: టాస్క్‌లో రచ్చ రచ్చ చేసిన హౌస్ మేట్స్.. ఏడ్చేసిన కిరాక్ సీత
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2024 | 3:25 PM

Share

బిగ్ బాస్ సీజన్ 8లో రోజుకొక రచ్చ జరుగుతోంది. మొదటి వారాం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం హౌస్‌లో నామినేషన్స్ గట్టిగానే జరిగాయి. హౌస్ మేట్స్ మధ్య గొడవలు బాగానే జరిగాయి. ఇక ఈ వారంలో విడుదలైన విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క. ఈ ఆరుగురు ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు మొదటి వారం హౌస్ నుంచి బయటకు రానున్నారు. వీరిలో పృథ్వీ, బెజవాడ బేబక్క డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈవారం ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారో చూడాలి. ఇదిలా ఉంటే ఈరోజు ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. హౌస్ మేట్స్‌కు ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లో బ్రిక్స్ టాస్క్ ఇచ్చాడు. ముందు విడుదల చేసిన ప్రోమోలో రెండు టీంలకు రింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండు టీమ్ సభ్యులు.. లైన్‌గా నిలబడి రింగ్స్‌ని చేతులతో టచ్ చేయకుండా.. కేవలంబాడీతోనే తీసుకుని వెళ్లాలని.. ఎక్కువ రింగ్స్‌ని ఎవరు చివరికి వరకూ తీసుకెళ్తారో వాళ్లే విన్నర్స్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక రీసెంట్ ప్రోమోలో బ్రిక్స్ టాస్క్ ఇచ్చాడు. నైనికా, యమ్మీ టీమ్స్ కు ఈ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఓ వెబ్ ఉంది దాని పై ఎక్కువ రాళ్లను నిటారుగా కింద పడకుండా నిలబెట్టాలి అని చెప్పాడు బిగ్ బాస్. ఎవరైతే ఎక్కువ రాళ్లను నిలబెడతారో వాళ్లు విన్నర్స్ అని చెప్పాడు. విన్ అయిన వాళ్ళు నిఖిల్ టీమ్ నుంచి ఒక సభ్యుడిని తీసుకుంటారు అని చెప్పాడు.

ఆ నెట్ నుంచి వెళ్లి ఇటుకలను నిటారుగా పెట్టడం టాస్క్. అయితే ముందు రెండు టీమ్స్ నుంచి ఒకొక్కరుగా వచ్చి జాగ్రత్తగా ఇటుకలను పెట్టారు. కానీ కొంచం టచ్ అయినా అవి పడిపోతున్నాయి. అయితే నైనికా టీమ్ లో ఉన్న ఆదిత్య ఓం ఇటుకలను సెట్ చేస్తుంటే.. యమ్మీ టీమ్ లో ఉన్న పృథ్వీ కావాలనే నైనికా టీమ్ వెబ్‌ను కదిలించి అవి పడేశాడు. దానికి ఆదిత్య ఓం షాక్ అయ్యాడు. నిఖిల్ ఆన్ ఫెయిర్ అని అన్నా కూడా ఎవరు వినలేదు. ఆతర్వాత ఒకరి వెబ్ ను మరొకరు తోస్తు.. రచ్చ రచ్చ చేశారు. టాస్క్ అయిపోయిన తర్వాత కిరాక్ సీత, అభయ్ మధ్య వాగ్వాదం జరిగింది. గిన్నెలు కడిగే దగ్గర ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది, నేను ఇంకెప్పుడు గేమ్ ఆడాలి. అంటూ సీత కన్నీళ్లుపెట్టుకుంది. అటు అభయ్ నువ్వు నా కింద పనిచేయడం లేదు అమ్మ. అది గేమ్ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా సీత వినిపించుకోకుండా ఏడ్చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.