AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ : ప్ర‌ముఖ‌ గాయని ఆశా భోంస్లే కరెంట్ బిల్ రూ.2 లక్షలు

విద్యుత్ కంపెనీలు సామ‌న్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు కూడా క‌రెంట్ బిల్లుల రూపంలో వాత‌లు పెడుతున్నాయి. ఈ లాక్ డౌన్ స‌మయంలో చాలామంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా విద్యుత్ సంస్థ‌ల‌పై ఫైర‌య్యారు.

షాకింగ్ : ప్ర‌ముఖ‌ గాయని ఆశా భోంస్లే కరెంట్ బిల్ రూ.2 లక్షలు
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2020 | 9:49 PM

Share

Asha Bhosle electricity bill : విద్యుత్ కంపెనీలు సామ‌న్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు కూడా క‌రెంట్ బిల్లుల రూపంలో వాత‌లు పెడుతున్నాయి. ఈ లాక్ డౌన్ స‌మయంలో చాలామంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా విద్యుత్ సంస్థ‌ల‌పై ఫైర‌య్యారు. త‌మ ప‌రిస్థితే ఇలా ఉంటే సామాన్యులు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా ఈ ఫిర్యాదులను సీరియ‌స్ గా తీసుకున్న విద్యుత్ శాఖ అధికారులు, చాలా మంది సెల‌బ్రిటీల ఇళ్ల‌కు వెళ్లి క్రాస్ చెక్ చేసి త‌మ త‌ప్పు ఏమి లేద‌ని క్లారిటీ ఇచ్చారు.

తాజాగా జూన్ నెల విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు రావడం వల్ల ప్రముఖ గాయని ఆశాభోంస్లే మహారాష్ట్ర విద్యుత్ బోర్డుకు కంప్లైంట్ చేశారు. లోనావాలా ఏరియాలో ఆమెకు బిల్డింగ్ ఉంది. జూన్ నెలలో ఆ బంగ్లా ప‌వ‌ర్ బిల్లు రూ.2,08,870 వచ్చింది. అదే బంగ్లాకు మే, ఏప్రిల్ నెలల్లో వరుసగా రూ.8,855, రూ.8,998 బిల్లులు వచ్చాయి. దీనిపై ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ఆమె బిల్డింగ్ వ‌ద్ద‌కు వెళ్లి విద్యుత్ మీటర్ చెక్ చేశారు. అనంతరం బిల్లు సరిగానే ఉందని స్ఫ‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం బంగ్లాలో షూటింగ్​లు జరుగుతున్నాయని అందుకే అంత బిల్లు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.

Read More : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

Follow Us