AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh: ఆ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకున్నా కానీ.. అల్లరి నరేష్ ఆసక్తికర కామెంట్స్

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ అల్లరోడు ఇప్పుడు సీరియస్ కంటెంట్స్ మీద దృష్టి పెట్టాడు. కామెడీ సినిమాలే కాదు సీరియస్ సినిమాలతోనూ మెప్పించగడాలని నిరూపించుకున్నారు అల్లరి నరేష్.

Allari Naresh: ఆ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకున్నా కానీ.. అల్లరి నరేష్ ఆసక్తికర కామెంట్స్
Allari Naresh
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2022 | 6:38 PM

Share

టాలీవుడ్‌లో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. తండ్రి ఈవీవీ సత్య నారాయణతో కలిసి ఎన్నో కామెడీ ప్రధాన సినిమాలు చేసిన నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ అల్లరోడు ఇప్పుడు సీరియస్ కంటెంట్స్ మీద దృష్టి పెట్టాడు. కామెడీ సినిమాలే కాదు సీరియస్ సినిమాలతోనూ మెప్పించగడాలని నిరూపించుకున్నారు అల్లరి నరేష్. అయితే కేరీర్ లి దూసుకుపోతున్న సమయంలోనే సీరియస్ సినిమాలు కూడా చేశారు నరేష్. అయితే తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఒకటి దారుణంగా నిరాశపరిచింది తెలిపారు నరేష్. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అం ఉకున్నారట కానీ సీన్ రివర్స్ అయ్యిందని తెలిపారు నరేష్. ప్రస్తుతం నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. కామెడీ సినిమాలే కాదు అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు కూడా నటించాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చాలా ముఖ్యం.. అప్పట్లో నేను చేసిన ప్రాణం, నేను లాంటి సినిమా ఫ్లాప్ గా నిలిచాయి. అయితే అయితే అప్పటివరకు కామెడీ సినిమాలు చేసే నన్ను అంత సీరియస్ సినిమాల్లో ప్రేక్షకులకు యాక్సెప్ట్ చేయలేదు అన్నారు.

అయితే నేను సినిమా పైన మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నాం.. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాం కానీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత దాదాపు 7 ఏళ్ళు టైం పట్టింది మళ్లీ అలాంటి సినిమా చేయడానికి అప్పుడే గమ్యం సినిమా చేశాను.. ఆ సినిమాలో నా పాత్రను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. ఇక శంభో శివ శంభో, మహర్షి సినిమాలకు మంచి పేరు వచ్చింది. అలాగా నాంది సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక పై కూడా కంటెంట్ ఉన్న కథలు చేయాలని నిర్ణయించుకున్నా అని తెలిపారు నరేష్.

ఇవి కూడా చదవండి